ETV Bharat / jagte-raho

వేర్వేరు ప్రమాదాలు.. ముగ్గురు వ్యక్తులు మృతి

author img

By

Published : Sep 14, 2020, 8:26 AM IST

రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతి వేగం కారణంగా ఆదివారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. వేర్వేరు చోట్ల జరిగిన ఆ ప్రమాదాలు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి.

two-were-died-on-the-spot-when-they-collided-with-bullock-cart-at-nagar-kurnool-district
వేర్వేరు ప్రమాదాలు.. ముగ్గురు వ్యక్తులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చౌటపల్లి సమీపంలో ఆదివారం రాత్రి బైక్​పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని బలంగా ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. గంధం కరుణాకర్(25), ముద్దం కూర్మయ్య(30) ఇద్దరు బాణాల నుంచి చౌటపల్లికి వెళ్తున్న సమయంలో.. చౌటపల్లి నుంచి వ్యవసాయ పనుల కోసం ఎడ్లబండిపై వెళ్తున్న రైతుని ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. ఎడ్లబండికి ఉన్న నోగలు గుచ్చుకుని బైక్ మీద ఉన్న ఇద్దరూ మరణించారు. కూర్మయ్యకు భార్యా, ముగ్గురు పిల్లలు ఉండగా.. కరుణాకర్​కు ఇంకా పెళ్లికాలేదు. బంధువుల రోదనలతో ఆసుపత్రి మిన్నంటింది.

దర్శనానికి వెళ్తూ..

ఇదిలా ఉంటే మరొక ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దర్శనానికి బైక్​పై వెళ్తున్న గోపికృష్ణ(25), రామకృష్ణ(22)లు ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టారు. గోపికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతను గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తిగా, రామకృష్ణ నరసరావుపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రామకృష్ణ తన మిత్రుడిని కలవడానికి హైదరాబాద్ వచ్చాడని తెలిసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : శ్రావణి కేసు: దేవరాజ్​రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య!

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చౌటపల్లి సమీపంలో ఆదివారం రాత్రి బైక్​పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని బలంగా ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. గంధం కరుణాకర్(25), ముద్దం కూర్మయ్య(30) ఇద్దరు బాణాల నుంచి చౌటపల్లికి వెళ్తున్న సమయంలో.. చౌటపల్లి నుంచి వ్యవసాయ పనుల కోసం ఎడ్లబండిపై వెళ్తున్న రైతుని ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. ఎడ్లబండికి ఉన్న నోగలు గుచ్చుకుని బైక్ మీద ఉన్న ఇద్దరూ మరణించారు. కూర్మయ్యకు భార్యా, ముగ్గురు పిల్లలు ఉండగా.. కరుణాకర్​కు ఇంకా పెళ్లికాలేదు. బంధువుల రోదనలతో ఆసుపత్రి మిన్నంటింది.

దర్శనానికి వెళ్తూ..

ఇదిలా ఉంటే మరొక ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దర్శనానికి బైక్​పై వెళ్తున్న గోపికృష్ణ(25), రామకృష్ణ(22)లు ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టారు. గోపికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతను గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తిగా, రామకృష్ణ నరసరావుపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రామకృష్ణ తన మిత్రుడిని కలవడానికి హైదరాబాద్ వచ్చాడని తెలిసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : శ్రావణి కేసు: దేవరాజ్​రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.