ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. కారులో గంజాయి

author img

By

Published : Aug 11, 2020, 7:59 PM IST

పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్​ ప్రాంతానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ఢీకొట్టింది. వాహనంలో వెళ్తున్న ఐదుగురిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్​లో పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వచ్చి ఇన్నోవా వాహనం తనిఖీ చేయగా... సీటు కింద రెండు ప్లాస్టిక్​ కవర్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

paderu
paderu

విశాఖ మన్యం పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్​ ప్రాంతానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని పాడేరు ఆసుపత్రికి అంబులెన్స్​లో తరిలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేయగా... కారు సీట్ల కింద రెండు ప్లాస్టిక్​ కవర్లలో రెండు కిలోల గంజాయిని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విశాఖ మన్యం పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్​ ప్రాంతానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని పాడేరు ఆసుపత్రికి అంబులెన్స్​లో తరిలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేయగా... కారు సీట్ల కింద రెండు ప్లాస్టిక్​ కవర్లలో రెండు కిలోల గంజాయిని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.