భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో విషాదం జరిగింది. సీతారామప్రాజెక్టు కాలువ దాటే క్రమంలో మల్లెల మడుగు గ్రామానికి చెందిన కూనేబోయిన వాసుకుమార్(13) అనే బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. అతని తల్లి ఏడాది క్రితం చనిపోగా, తండ్రి బాలున్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.
వాళ్ల తాతయ్య వద్ద ఉంటూ బాలుడు జీవనం సాగిస్తున్నాడు. తాతయ్యతో కలిసి మేకలు కాసేందుకు వెళ్లి విగతజీవిగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు,రెవెన్యూ అధికారులు ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.