సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి బజార్లో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమానులు బెంగళూరు వెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి మూడు తులాల బంగారం అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
దొంగతనం జరిగిందని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్