ETV Bharat / jagte-raho

పెట్టుబడి పేరుతో రూ.10కోట్లు టోకరా.. బాధితుల ఆందోళన

author img

By

Published : Nov 19, 2020, 10:23 AM IST

వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. వచ్చిన లాభంలో కమిషన్ ఇస్తామని నమ్మబలికిన దంపతులు.. రూ.10 కోట్లు దండుకుని మోసం చేసిన సంఘటన హైదరాబాద్ సనత్​నగర్​ డివిజన్​లోని బాలాజీ అపార్ట్​మెంట్​లో చోటుచేసుకుంది. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ten crore rupees cheating in the name of profits in Hyderabad
పెట్టుబడి పేరుతో రూ.10కోట్లు టోకరా

హైదరాబాద్​ సనత్​నగర్​ డివిజన్​ బాలయ్యనగర్​లో బాలాజీ అపార్ట్​మెంట్​లో నివసించే గంట గాంధీ-రమాదేవి, గంట సంతోశ్-మంగమ్మ దంపతులు వారి చుట్టుపక్కల నివసించే వారిని నమ్మబలికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టించారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే వచ్చిన లాభంలో కమిషన్ ఇస్తామని చెప్పి.. రూ.10 కోట్లు దండుకున్నారు.

వారి మోసం గమనించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సనత్​నగర్​ పోలీసులకు అపార్ట్​మెంట్​ వాసులు (బాధితులు) నాగజ్యోతి, మన్మథరావు, పూర్ణిమ, హేమలత, నాగమణిలు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

హైదరాబాద్​ సనత్​నగర్​ డివిజన్​ బాలయ్యనగర్​లో బాలాజీ అపార్ట్​మెంట్​లో నివసించే గంట గాంధీ-రమాదేవి, గంట సంతోశ్-మంగమ్మ దంపతులు వారి చుట్టుపక్కల నివసించే వారిని నమ్మబలికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టించారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే వచ్చిన లాభంలో కమిషన్ ఇస్తామని చెప్పి.. రూ.10 కోట్లు దండుకున్నారు.

వారి మోసం గమనించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సనత్​నగర్​ పోలీసులకు అపార్ట్​మెంట్​ వాసులు (బాధితులు) నాగజ్యోతి, మన్మథరావు, పూర్ణిమ, హేమలత, నాగమణిలు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.