ETV Bharat / jagte-raho

'జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధి హత్య కేసులో నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్' - నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్నేహితుడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

'జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధి హత్య కేసులో నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్'
'జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధి హత్య కేసులో నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్'
author img

By

Published : Sep 15, 2020, 7:19 AM IST

ఈ నెల 11న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితుడి నుంచి ఒక కత్తి, బ్లేడ్​ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

ఇద్దరూ పాత మిత్రులే..

మృతుడు రాజేష్ అలియాస్ రాజు , నిందితుడు షమర్‌ బేగ్ అలియాస్ షమీ బేగ్‌ ఇద్దరూ పాత మిత్రులేనని ఆయన వివరించారు. ఇద్దరూ కలిసి సినిమా సెట్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవారన్నారు. వీరిద్దరూ కలిసి ఈ నెల 9న రాత్రి మద్యం కొనుగోలు చేసి ఇందిరానగర్‌లో షమీ బేగ్‌ గదికి వెళ్లి సేవించినట్లు తెలిపారు.

రాజును అనుమానించాడు..

మరుసటి రోజు ఉదయం షమీ బేగ్ నివాసంలో సిలిండర్​తో పాటు రూ.900 రూపాయలు కనిపించకపోవడంతో మృతుడు రాజును అనుమానించాడు. అతనిపై పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 8గంటలకు కృష్ణానగర్‌ ప్రధాన రహదారిపై గల మెట్రో డివైడర్‌లో కూర్చుని ఉండగా అతనిపై దాడి చేసి తన వెంట తీసుకొచ్చిన కత్తితో రాజును బలంగా పొడిచి చంపాడని డీసీపీ తెలిపారు.

ఇవీ చూడండి : 'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

ఈ నెల 11న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితుడి నుంచి ఒక కత్తి, బ్లేడ్​ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

ఇద్దరూ పాత మిత్రులే..

మృతుడు రాజేష్ అలియాస్ రాజు , నిందితుడు షమర్‌ బేగ్ అలియాస్ షమీ బేగ్‌ ఇద్దరూ పాత మిత్రులేనని ఆయన వివరించారు. ఇద్దరూ కలిసి సినిమా సెట్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవారన్నారు. వీరిద్దరూ కలిసి ఈ నెల 9న రాత్రి మద్యం కొనుగోలు చేసి ఇందిరానగర్‌లో షమీ బేగ్‌ గదికి వెళ్లి సేవించినట్లు తెలిపారు.

రాజును అనుమానించాడు..

మరుసటి రోజు ఉదయం షమీ బేగ్ నివాసంలో సిలిండర్​తో పాటు రూ.900 రూపాయలు కనిపించకపోవడంతో మృతుడు రాజును అనుమానించాడు. అతనిపై పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 8గంటలకు కృష్ణానగర్‌ ప్రధాన రహదారిపై గల మెట్రో డివైడర్‌లో కూర్చుని ఉండగా అతనిపై దాడి చేసి తన వెంట తీసుకొచ్చిన కత్తితో రాజును బలంగా పొడిచి చంపాడని డీసీపీ తెలిపారు.

ఇవీ చూడండి : 'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.