సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున నేమిచంద్ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దుకాణం యజమాని వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
తన స్నేహితులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడిన్నట్ట పోలీసుల విచారణలో డ్రైవర్ చెప్పాడు. దుకాణం వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించి నిందుతులు.. 1.20 కేజీల బంగారం, 302 గ్రాముల వెండి దోచుకెళ్లారు. చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: జ్యువెలరీ షాప్లో 1.20 కిలోల బంగారం చోరీ