ETV Bharat / jagte-raho

లారీ కింద పడి ఇద్దరు యువకుల మృతి

author img

By

Published : Sep 25, 2020, 9:01 AM IST

లారీ కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

road accident in rangareddy district
లారీ కింద పడి ఇద్దరు యువకుల మృతి

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోకాపేట్ మూవీ టవర్ వైపు వెళ్తున్న రెడిమిక్స్ లారీని వెనక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ టైర్ల కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.

మృతుల్లో ఒకరు నాగర్​ కర్నూల్​ జిల్లాకు చెందిన రమేశ్​గా​ గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఒక్కసారిగా ఆగడం వల్ల ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోకాపేట్ మూవీ టవర్ వైపు వెళ్తున్న రెడిమిక్స్ లారీని వెనక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ టైర్ల కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.

మృతుల్లో ఒకరు నాగర్​ కర్నూల్​ జిల్లాకు చెందిన రమేశ్​గా​ గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఒక్కసారిగా ఆగడం వల్ల ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.