ETV Bharat / jagte-raho

కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

author img

By

Published : Sep 5, 2020, 7:25 AM IST

మహబూబ్​నగర్​ జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

road accident
road accident

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో శ్రీనివాస కాలనీ వద్ద జడ్చర్ల ప్రధాన రహదారిపై కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

జడ్చర్ల వైపు నుంచి మహబూబ్​నగర్​ వైపు వస్తున్న ద్విచక్రవాహనాలను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణం అక్కడి నుంచి మహబూబ్​నగర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో శ్రీనివాస కాలనీ వద్ద జడ్చర్ల ప్రధాన రహదారిపై కారు, రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

జడ్చర్ల వైపు నుంచి మహబూబ్​నగర్​ వైపు వస్తున్న ద్విచక్రవాహనాలను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణం అక్కడి నుంచి మహబూబ్​నగర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతివేగం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ఇదీ చూడండి: రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.