ETV Bharat / jagte-raho

చైనా మాంజా పట్టివేత.. ఒకరి అరెస్ట్​

author img

By

Published : Jan 7, 2021, 10:41 PM IST

చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళహాట్​లో మాంజా బిండలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలెవరూ వీటిని కొనరాదని విన్నవించారు.

Case registered against shop owner selling China Manza
చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణ యజమానిపై కేసు నమోదు

సంక్రాంతి సమీపిస్తుండటంతో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పర్యావరణానికి (పక్షులకు) హాని చేసే 30బిండల మాంజాను హైదరాబాద్​ మంగళహాట్​లో స్వాధీనం చేసుకున్నారు.

పక్షులకు ప్రమాదం..

మంగళహాట్​లో జాలి హనుమాన్ వద్ద సత్యనారాయణ పతంగ్ ఘర్ అనే ఓ దుకాణంపై దాడి నిర్వహించామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మాంజా విక్రయిస్తున్న యజమాని​పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మాంజా వల్ల పక్షులకు ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని సీఐ రణవీర్ రెడ్డి తెలిపారు. ఎవరూ వీటిని కొనరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

సంక్రాంతి సమీపిస్తుండటంతో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పర్యావరణానికి (పక్షులకు) హాని చేసే 30బిండల మాంజాను హైదరాబాద్​ మంగళహాట్​లో స్వాధీనం చేసుకున్నారు.

పక్షులకు ప్రమాదం..

మంగళహాట్​లో జాలి హనుమాన్ వద్ద సత్యనారాయణ పతంగ్ ఘర్ అనే ఓ దుకాణంపై దాడి నిర్వహించామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మాంజా విక్రయిస్తున్న యజమాని​పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మాంజా వల్ల పక్షులకు ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని సీఐ రణవీర్ రెడ్డి తెలిపారు. ఎవరూ వీటిని కొనరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.