ETV Bharat / jagte-raho

ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం

author img

By

Published : Feb 29, 2020, 11:22 PM IST

హైదరాబాద్‌ చైతన్యపురిలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతికి ఎవరు కారణం కాదంటూ సూసైట్​ నోట్​ రాసింది.

pharmacy student suicide in Hyderabad
ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం

హైదరాబాద్‌ చైతన్యపురిలోని అలకాపురి కాలనీలో ఓ ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్‌ రాసి పెట్టింది. మృతురాలు యాదగిరిగుట్ట మండలంలోని కందుకూరు గ్రామ సర్పంచ్‌ కూతురు తేజస్విని. అలకాపురిలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ.. నగర శివారులోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుకుంటుంది. తను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌ చైతన్యపురిలోని అలకాపురి కాలనీలో ఓ ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్‌ రాసి పెట్టింది. మృతురాలు యాదగిరిగుట్ట మండలంలోని కందుకూరు గ్రామ సర్పంచ్‌ కూతురు తేజస్విని. అలకాపురిలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ.. నగర శివారులోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుకుంటుంది. తను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్ శివారులో దారుణం.. కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.