ETV Bharat / jagte-raho

విశాఖ మన్యంలో మాంసాహారం తిని 76 మందికి అస్వస్థత - విశాఖలో ఆవు మాంసం తిని 76 మంది అస్వస్థత

విశాఖ మన్యంలో మాంసాహారం తిని 76 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన గోవు మాంసాన్ని రెండురోజుల పాటు తిని వాంతులు విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

విశాఖ మన్యంలో మాంసాహారం తిని 76 మందికి అస్వస్థత
విశాఖ మన్యంలో మాంసాహారం తిని 76 మందికి అస్వస్థత
author img

By

Published : Jul 9, 2020, 9:56 AM IST

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చనిపోయిన గోవు మాంసాన్ని తిని.. అతిసారంతో 76 మంది ఆస్పత్రి పాలయ్యారు. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెంలో సోమవారం ఓ ఆవు మృతి చెందింది. గ్రామంలో వారందరూ రెండు రోజులు పాటు నిల్వ ఉన్న గోమాంసం తిన్నారు. ఈ క్రమంలో 76 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వీరిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు.

వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చనిపోయిన గోవు మాంసాన్ని తిని.. అతిసారంతో 76 మంది ఆస్పత్రి పాలయ్యారు. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెంలో సోమవారం ఓ ఆవు మృతి చెందింది. గ్రామంలో వారందరూ రెండు రోజులు పాటు నిల్వ ఉన్న గోమాంసం తిన్నారు. ఈ క్రమంలో 76 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వీరిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు.

వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి:

అగ్రనటులను పరిచయం చేసిన 'సహజ' దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.