ETV Bharat / jagte-raho

రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు

సోన్ మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి తహసీల్దార్​కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

author img

By

Published : Dec 18, 2020, 4:43 PM IST

pds rice seized at soan mandal in nirmal district
రేషన్ బియ్యం పట్టివేత... ఇద్దరిపై కేసు నమోదు

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సోన్ ఎస్సై ఆసిఫ్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఓ ఆటో అనుమానంగా కనిపించడంతో సోదాలు చేసి... 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

ఓ మోటార్ సైకిల్​పై ఒక క్వింటా బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ రియాజ్, షేక్ ముస్తాక్ బేగ్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి.. తహసీల్దార్​కు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సోన్ ఎస్సై ఆసిఫ్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఓ ఆటో అనుమానంగా కనిపించడంతో సోదాలు చేసి... 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

ఓ మోటార్ సైకిల్​పై ఒక క్వింటా బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ రియాజ్, షేక్ ముస్తాక్ బేగ్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి.. తహసీల్దార్​కు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి: బంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపే దోచేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.