ETV Bharat / jagte-raho

మెట్​పల్లి ఖాదీ బోర్టు ఛైర్మన్ రాజేశ్వర్​రావు కన్నుమూత - Met Palli Khadi Board Chairman Kalwakuntla Rajeshwar Rao has died

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఖాదీ బోర్టు ఛైర్మన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్​ కల్వకుంట్ల రాజేశ్వర్ రావు కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ​

Met Palli Khadi Board Chairman Kalwakuntla Rajeshwar Rao died of heart attack in Hyderabad
మెట్​పల్లి ఖాదీ బోర్టు ఛైర్మన్ రాజేశ్వర్​రావు కన్నుమూత
author img

By

Published : Aug 27, 2020, 12:40 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఖాదీ బోర్డు ఛైర్మన్, ఉమ్మడి కరీంనగర్​ జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ కల్వకుంట్ల రాజేశ్వర్​ రావు హైదరాబాద్​లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు.. గ్రామ సర్పంచ్​గా మూడు సార్లు గెలుపొందారు. 2001లో మెట్​పల్లి జడ్పీటీసీగా గెలుపొంది ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా సేవలందించారు. తెరాస ఆవిర్భావం అనంతరం కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

2006 మార్చిలో మెట్​పల్లి ఖాదీ బోర్డు డైరెక్టర్​గా చేరిన రాజేశ్వరరావు 2008 మే 28న ఖాదీ బోర్డు ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల మధ్యే ఉంటూ పుట్టిన ఊరు అభివృద్ధికి కృషి చేసిన రాజేశ్వర్ రావు మృతితో మొగిలిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కల్వకుంట్ల రాజేశ్వర్ రావుకి చివరిసారిగా వీడ్కోలు పలికారు. రాజేశ్వర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఖాదీ బోర్డు ఛైర్మన్, ఉమ్మడి కరీంనగర్​ జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ కల్వకుంట్ల రాజేశ్వర్​ రావు హైదరాబాద్​లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు.. గ్రామ సర్పంచ్​గా మూడు సార్లు గెలుపొందారు. 2001లో మెట్​పల్లి జడ్పీటీసీగా గెలుపొంది ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా సేవలందించారు. తెరాస ఆవిర్భావం అనంతరం కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

2006 మార్చిలో మెట్​పల్లి ఖాదీ బోర్డు డైరెక్టర్​గా చేరిన రాజేశ్వరరావు 2008 మే 28న ఖాదీ బోర్డు ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల మధ్యే ఉంటూ పుట్టిన ఊరు అభివృద్ధికి కృషి చేసిన రాజేశ్వర్ రావు మృతితో మొగిలిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కల్వకుంట్ల రాజేశ్వర్ రావుకి చివరిసారిగా వీడ్కోలు పలికారు. రాజేశ్వర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.