ETV Bharat / jagte-raho

కాకివాగులో గల్లంతైన వ్యక్తి కంబాపూర్​లో శవమై తేలాడు

author img

By

Published : Sep 30, 2020, 6:39 PM IST

నాలుగు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం కాకివాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం... కామారెడ్డి జిల్లా కంబాపూర్​ వాగులో లభించింది. నాలుగు రోజులుగా గాలిస్తున్నా... దొరకకపోవడం వల్ల ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలతో వెతికినట్టు కంగ్టి తహసీల్దార్ నాగరాజు తెలిపారు.

man missing in kakivagu and his dead body found at kambapur
కాకివాగులో గల్లంతైన వ్యక్తి కంబాపూర్​లో శవమై తేలాడు


సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని కాకివాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇవాళ గుర్తించినట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నెల 26న కురిసిన భారీ వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో వంతెన మీది నుంచి వాగు దాటేందుకు ప్రయత్నించగా... గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి కొట్టుకుపోయాడు.

గల్లంతైన మారుతి ఆచూకీ లభించకపోవడం వల్ల... నాలుగు రోజులుగా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా దొరకలేదు. దీంతో ఇవాళ ఎన్డీఆర్​ఎఫ్​ బృందాల సాయంతో వెతికారు. కామారెడ్డి జిల్లా కంబాపూర్​ వద్ద వాగులో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు మారుతి మృతదేహాన్ని గుర్తించాయి.


సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని కాకివాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇవాళ గుర్తించినట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నెల 26న కురిసిన భారీ వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో వంతెన మీది నుంచి వాగు దాటేందుకు ప్రయత్నించగా... గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి కొట్టుకుపోయాడు.

గల్లంతైన మారుతి ఆచూకీ లభించకపోవడం వల్ల... నాలుగు రోజులుగా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా దొరకలేదు. దీంతో ఇవాళ ఎన్డీఆర్​ఎఫ్​ బృందాల సాయంతో వెతికారు. కామారెడ్డి జిల్లా కంబాపూర్​ వద్ద వాగులో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు మారుతి మృతదేహాన్ని గుర్తించాయి.

ఇదీ చూడండి: చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.