ETV Bharat / jagte-raho

అదుపుతప్పి ద్విచక్రవాహనం బోల్తా.. వ్యక్తి మృతి

author img

By

Published : Sep 8, 2020, 5:25 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతిచెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన తిప్పల గంగయ్య... వ్యక్తిగత పని మీద ద్విచక్రవాహనంపై గజ్వేల్ కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో శ్రీగిరి పల్లి సమీపంలోకి వెళ్లగానే నడుపుతున్న వాహనం అదుపుతప్పి కింద పడిపోయింది.

ఈ ప్రమాదంలో గంగయ్య తలకు బలమైన గాయం కాగా.. అక్కడికక్కడే మృతి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన తిప్పల గంగయ్య... వ్యక్తిగత పని మీద ద్విచక్రవాహనంపై గజ్వేల్ కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో శ్రీగిరి పల్లి సమీపంలోకి వెళ్లగానే నడుపుతున్న వాహనం అదుపుతప్పి కింద పడిపోయింది.

ఈ ప్రమాదంలో గంగయ్య తలకు బలమైన గాయం కాగా.. అక్కడికక్కడే మృతి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.