ETV Bharat / jagte-raho

ఎస్సార్​ నగర్​లో కరెంట్​ షాక్​ తగిలి.. బార్​ క్యాషియర్​ మృతి

author img

By

Published : Oct 14, 2020, 2:51 PM IST

హైదరాబాద్​ ఎస్సార్​నగర్​లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో బార్​లో క్యాషియర్​గా పనిచేసే వ్యక్తి విద్యుత్​ షాక్​తో మరణించాడు. బార్​లోకి ఒక్కసారిగా వరదనీరు రాగా.. ఈ క్రమంలో బయటకు వెళ్లిన క్యాషియర్​కు కరెంట్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

man died due to current shock at sr nagar
ఎస్సార్​ నగర్​లో కరెంట్​ షాక్​ తగిలి.. బార్​ క్యాషియర్​ మృతి

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ ఎస్సార్​ నగర్​ పరిధిలోని గోల్డెన్​ కేఫ్​ బార్​లో క్యాషియర్​గా పనిచేసే శ్రీనివాస్​ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బార్​లోకి వర్షపు నీరు ప్రవేశించగా.. దుకాణంలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో శ్రీనివాస్​కు కరెంట్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు మేనేజర్​ సుబ్బారెడ్డి తెలిపారు.

బార్​లోకి పెద్ద ఎత్తున వరదనీరు రాగా.. క్యాషియర్​ బయటకు వెళ్తుండగా షాక్​ తగిలిందని మేనేజర్​ పేర్కొన్నారు. అతన్ని రక్షించే క్రమంలో తాము భయపడి వెనక్కి వెళ్లామని మేనేజర్​ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ ఎస్సార్​ నగర్​ పరిధిలోని గోల్డెన్​ కేఫ్​ బార్​లో క్యాషియర్​గా పనిచేసే శ్రీనివాస్​ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బార్​లోకి వర్షపు నీరు ప్రవేశించగా.. దుకాణంలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో శ్రీనివాస్​కు కరెంట్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు మేనేజర్​ సుబ్బారెడ్డి తెలిపారు.

బార్​లోకి పెద్ద ఎత్తున వరదనీరు రాగా.. క్యాషియర్​ బయటకు వెళ్తుండగా షాక్​ తగిలిందని మేనేజర్​ పేర్కొన్నారు. అతన్ని రక్షించే క్రమంలో తాము భయపడి వెనక్కి వెళ్లామని మేనేజర్​ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్​సాగర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.