ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ లోన్​ వేధింపులకు మరో ప్రాణం బలి

author img

By

Published : Dec 3, 2020, 2:29 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్​లైన్​ లోన్​ వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వాపోయారు.

Man commits suicide for online loan harassment at  Narsapur, Medak District
ఆన్​లైన్​ లోన్​ వేధింపులకు మరో ప్రాణం బలి

ఆన్​లైన్​ లోన్​ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణానికి శ్రావణ్​ అనే యువకుడు ఆన్​లైన్​ ద్వారా 16వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లింపులో ఆలస్యమవడం వల్ల ఆ సంస్థ ప్రతినిధులు పలుమార్లు అడిగారు. నోటీసులు పంపడంతో పాటు... వాట్సాప్​లో శ్రావణ్​ను తిరిగి చెల్లింపుల గురించి ఒత్తిడి చేశారు.

బంధువులకు సైతం ఫోన్​ చేసి... అప్పు గురించి చెప్పారు. అవమానంగా భావించి శ్రావణ్​ నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పరిస్థితి మరొకరికి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

ఆన్​లైన్​ లోన్​ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణానికి శ్రావణ్​ అనే యువకుడు ఆన్​లైన్​ ద్వారా 16వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లింపులో ఆలస్యమవడం వల్ల ఆ సంస్థ ప్రతినిధులు పలుమార్లు అడిగారు. నోటీసులు పంపడంతో పాటు... వాట్సాప్​లో శ్రావణ్​ను తిరిగి చెల్లింపుల గురించి ఒత్తిడి చేశారు.

బంధువులకు సైతం ఫోన్​ చేసి... అప్పు గురించి చెప్పారు. అవమానంగా భావించి శ్రావణ్​ నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పరిస్థితి మరొకరికి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.