ETV Bharat / jagte-raho

వివాహేతర సంబంధం... తీసింది ప్రాణం - రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య

మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిన వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడిని భర్తతో కలిసి దారుణంగా హతమార్చింది ఓ మహిళ. ఈ సంఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది.

man-brutally-murdered-in-rayachoti-kadapa-district in ap
వివాహేతర సంబంధం... తీసింది ప్రాణం
author img

By

Published : Dec 4, 2020, 7:34 AM IST

Updated : Dec 4, 2020, 7:42 AM IST

ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. రాజుల కాలనీకి చెందిన యూసఫ్ కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహితతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గతంలో ఈ విషయంపై ఆ మహిళ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీరిరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనతో మార్పు కలగని యూసఫ్ మళ్లీ ఆ మహిళకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన యూసఫ్​ను.. మహిళ, ఆమె భర్త మౌలాలి కలిసి దారుణంగా తలపై కొట్టారు. ఈ ఘటనలో యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. రాజుల కాలనీకి చెందిన యూసఫ్ కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహితతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గతంలో ఈ విషయంపై ఆ మహిళ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీరిరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనతో మార్పు కలగని యూసఫ్ మళ్లీ ఆ మహిళకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన యూసఫ్​ను.. మహిళ, ఆమె భర్త మౌలాలి కలిసి దారుణంగా తలపై కొట్టారు. ఈ ఘటనలో యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్‌ మోసానికి స్కెచ్.. హెచ్చరించిన ఇంటర్‌పోల్‌

Last Updated : Dec 4, 2020, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.