ETV Bharat / jagte-raho

నకిలీ పాస్​పోర్ట్​తో పదేళ్లుగా ప్రయాణం... చివరకు ఇలా చిక్కాడు... - నకిలీ పాస్​పోర్ట్​తో వ్యక్తి అరెస్ట్​

నకిలీ పాస్​పోర్ట్​తో విదేశాల నుంచి వస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్​ విమానాశ్రయంలో ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్లుగా నకిలీ పాస్​పోర్ట్​తో పలుమార్లు ప్రయాణించినట్లు గుర్తించారు.

నకిలీ పాస్​పోర్ట్​తో పదేళ్లుగా ప్రయాణం... చివరకు ఇలా చిక్కాడు
నకిలీ పాస్​పోర్ట్​తో పదేళ్లుగా ప్రయాణం... చివరకు ఇలా చిక్కాడు
author img

By

Published : Sep 30, 2020, 9:34 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ పాస్‌పోర్టుతో వచ్చిన వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పాస్​పోర్ట్​పై విదేశాలకు వెళ్లొస్తూ.. హైదరాబాద్​లో రెన్యువల్​ కోసం వచ్చిన కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన గంగావత్ బాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కాడు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన గంగావత్ బాలు(38), విదేశాలలో పనిచేసేందుకు రవీందర్ రతుల పేరుపై 2010లో నకిలీ పాస్ పోర్టు చేయించుకున్నాడు. దాదాపు పదేళ్లలో ఇండియా నుంచి బహ్రెయిన్​కు ఆరు సార్లు వెళ్లి వచ్చాడు. సెప్టెంబరు 26న ఆరోగ్యం బాగాలేదని అత్యవసర ధ్రువపత్రంతో శంషాబాద్ విమానాశ్రయానికొచ్చాడు.

ఇలా దొరికాడు..

గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తతంగం పాస్​పోర్ట్​ రెన్యువల్ చేయాల్సి రావడం వల్ల బయటపడింది. ఆగస్టు 15 నాటికి గడువు ముగిసినందున తన పాస్​పోర్ట్​ను రెన్యువల్ చేయవలసిందిగా పాస్​పోర్టు అధికారులను గంగావత్ బాలు దరఖాస్తు చేసుకున్నాడు. అతడు సమర్పించిన పాస్​పోర్ట్​లో రవీంద్ర రతుల పేరు ఉండడం.. ఆధార్, పాన్​కార్డు గంగావత్ బాలు పేరుమీద ఉండడం వల్ల అనుమానమొచ్చిన పోలీసులు నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో గంగవత్ బాలు... తానొక ఏజెన్సీ వద్ద నుంచి పదేళ్ల క్రితం నకిలీ పాస్​పోర్ట్​ తయారు చేసుకున్నానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ పాస్‌పోర్టుతో వచ్చిన వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పాస్​పోర్ట్​పై విదేశాలకు వెళ్లొస్తూ.. హైదరాబాద్​లో రెన్యువల్​ కోసం వచ్చిన కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన గంగావత్ బాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కాడు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన గంగావత్ బాలు(38), విదేశాలలో పనిచేసేందుకు రవీందర్ రతుల పేరుపై 2010లో నకిలీ పాస్ పోర్టు చేయించుకున్నాడు. దాదాపు పదేళ్లలో ఇండియా నుంచి బహ్రెయిన్​కు ఆరు సార్లు వెళ్లి వచ్చాడు. సెప్టెంబరు 26న ఆరోగ్యం బాగాలేదని అత్యవసర ధ్రువపత్రంతో శంషాబాద్ విమానాశ్రయానికొచ్చాడు.

ఇలా దొరికాడు..

గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తతంగం పాస్​పోర్ట్​ రెన్యువల్ చేయాల్సి రావడం వల్ల బయటపడింది. ఆగస్టు 15 నాటికి గడువు ముగిసినందున తన పాస్​పోర్ట్​ను రెన్యువల్ చేయవలసిందిగా పాస్​పోర్టు అధికారులను గంగావత్ బాలు దరఖాస్తు చేసుకున్నాడు. అతడు సమర్పించిన పాస్​పోర్ట్​లో రవీంద్ర రతుల పేరు ఉండడం.. ఆధార్, పాన్​కార్డు గంగావత్ బాలు పేరుమీద ఉండడం వల్ల అనుమానమొచ్చిన పోలీసులు నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో గంగవత్ బాలు... తానొక ఏజెన్సీ వద్ద నుంచి పదేళ్ల క్రితం నకిలీ పాస్​పోర్ట్​ తయారు చేసుకున్నానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.