ఫోర్జరీ పత్రాలతో ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కార్మికనగర్కు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తికి చెందిన 224 గజాల ఇంటి స్థలాన్ని బాలప్రకాష్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిందితుడు బాలప్రకాష్ తప్పుడు పత్రాలను సృష్టించాడని తేలడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: ఎవరూ లేని వారి కోసం ఆ నలుగురిగా మారింది!!