ETV Bharat / jagte-raho

పెళ్లయిన పదహారు రోజులకే యువతి ఆత్మహత్య - పెళ్లైన పదహారు రోజులకే వధువు ఆత్మహత్య

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్​లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని, మరొకరితో వివాహం చేశారని అత్తవారింట్లో ఉరి వేసుకొని ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది.

groom suicide within sixteen days in manikyapur
పెళ్లైన పదహారు రోజులకే యువతి ఆత్మహత్య
author img

By

Published : Dec 29, 2020, 10:44 AM IST

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవలికి, భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్​కు చెందిన రాజుతో 16 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తన చావుకు ఎవరు కారణం కాదని... పెళ్లికి కులం, మతం చూడవద్దని తల్లిదండ్రులకు సూచించింది. క్షమించమని భర్తను కోరింది. పెళ్లై పక్షం రోజులు కాకముందే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవలికి, భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్​కు చెందిన రాజుతో 16 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తన చావుకు ఎవరు కారణం కాదని... పెళ్లికి కులం, మతం చూడవద్దని తల్లిదండ్రులకు సూచించింది. క్షమించమని భర్తను కోరింది. పెళ్లై పక్షం రోజులు కాకముందే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తాగి వేధిస్తున్న భర్తకు నడిరోడ్డుపై దేహశుద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.