ETV Bharat / jagte-raho

'ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారు.. కొడుతున్నారు'

author img

By

Published : Jan 26, 2021, 5:04 PM IST

ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు తీసుకుని.. చివరికి తమపైనే దాడి చేశారని కొందరు విద్యార్థులు ఏపీలోని విశాఖలో పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై గతంలోనూ ఫిర్యాదులు అందాయని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

visakhapatnam news
'ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారు.. ప్రశ్నిస్తే దాడి చేశారు'

సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారని.. ప్రశ్నిస్తే.. తిరిగి తమపైనే దాడిచేశారంటూ కొంతమంది విద్యార్థులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు.

ఏం చేేశారు..

ఎన్​ఏడి కూడలి కాకానినగర్​ వద్ద యూఎస్​ సాఫ్ట్​వేర్ సొల్యూషన్స్​ సంస్థ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటన చేసింది. అది చూసి ఉద్యోగం​ కోసం వెళ్లిన ఒక్కొక్కరికి చేత రూ.2,500 చొప్పున కట్టించుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగలివ్వలేదు.

తాము కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఓ యువతి.. ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి అడిగినట్టు చెప్పింది. వారు తనను గదిలో బంధించి.. దాడి చేసి.. గాయపరిచినట్టు ఎయిర్​పోర్ట్ పోలీస్​స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన లాగే వందలాది విద్యార్థులు డబ్బులు కట్టి మోసపోయారని తెలిపింది. న్యాయం చేయాలని కోరుతూ.. కొంతమంది బాధితులు పోలీసులను కోరారు. ఇదే సంస్థపై గతంలోనూ ఫిర్యాదులు అందాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

'ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారు.. ప్రశ్నిస్తే దాడి చేశారు'

ఇవీచూడండి: సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 16 దారుణ హత్యలు!

సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారని.. ప్రశ్నిస్తే.. తిరిగి తమపైనే దాడిచేశారంటూ కొంతమంది విద్యార్థులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు.

ఏం చేేశారు..

ఎన్​ఏడి కూడలి కాకానినగర్​ వద్ద యూఎస్​ సాఫ్ట్​వేర్ సొల్యూషన్స్​ సంస్థ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటన చేసింది. అది చూసి ఉద్యోగం​ కోసం వెళ్లిన ఒక్కొక్కరికి చేత రూ.2,500 చొప్పున కట్టించుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగలివ్వలేదు.

తాము కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఓ యువతి.. ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి అడిగినట్టు చెప్పింది. వారు తనను గదిలో బంధించి.. దాడి చేసి.. గాయపరిచినట్టు ఎయిర్​పోర్ట్ పోలీస్​స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన లాగే వందలాది విద్యార్థులు డబ్బులు కట్టి మోసపోయారని తెలిపింది. న్యాయం చేయాలని కోరుతూ.. కొంతమంది బాధితులు పోలీసులను కోరారు. ఇదే సంస్థపై గతంలోనూ ఫిర్యాదులు అందాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

'ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారు.. ప్రశ్నిస్తే దాడి చేశారు'

ఇవీచూడండి: సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 16 దారుణ హత్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.