ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ జూదం కేసులో కీలక నిందితుడు అరెస్ట్​

ఆన్​లైన్​ జూదం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్​ చేయగా... మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్​లైన్​ జూదం, క్రిప్టో కరెన్సీ లాంటి నిషేదిత వ్యాపారాలను నడుపుతున్న నైసర్​ కొఠారి అనే వ్యక్తికి అరెస్టు చేశారు. ఈడీ అధికారులు కస్టడీ కోరగా.. 13 నుంచి 22 వరకు న్యాయస్థానం అనుమతించింది.

author img

By

Published : Dec 11, 2020, 8:09 PM IST

ed arrested main accused in online betting in hyderabad
ed arrested main accused in online betting in hyderabad

ఆన్​లైన్ జూదం కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు నైసర్ కొఠారి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నైసర్ కొఠారి క్రిప్టో కరెన్సీ విధానంలో నగదును హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నిషేధిత ఆన్​లైన్ జూదం నిర్వహిస్తున్న లింక్యున్ టెక్నాలజీ, డాకీ పే ప్రైవేట్ లిమిటెడ్​తో పాటు మరికొన్ని కంపెనీలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా చైనాకు తరలించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో ఇప్పటికే దిల్లీకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితులపై ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్​ఎస్​బీసీ బ్యాంకు, పేటీఎం, క్యాష్ ఫ్రీ రోజీ పే ద్వారా నగదును చైనాకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్న నైసర్ కొఠారి హస్తం ఉన్నట్లు వెల్లడైంది. భావ్​నగర్​లో క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్న నైసర్.. ఆన్​లైన్ జూదం నిర్వాహకుల నుంచి నగదు స్వీకరించి దానిని విదేశాలకు తరలించినట్లు తెలిసింది. నైసర్ కొఠారిని న్యాయస్థానంలో హాజరు పరచిన ఈడీ కస్టడీకి కోరగా... 13 నుంచి 22 వరకు న్యాయస్థానం అనుమతించింది.

ఇదీ చూడండి: చిట్టీల పేరుతో వంద మందికి రూ.10 కోట్ల కుచ్చుటోపీ

ఆన్​లైన్ జూదం కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు నైసర్ కొఠారి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నైసర్ కొఠారి క్రిప్టో కరెన్సీ విధానంలో నగదును హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నిషేధిత ఆన్​లైన్ జూదం నిర్వహిస్తున్న లింక్యున్ టెక్నాలజీ, డాకీ పే ప్రైవేట్ లిమిటెడ్​తో పాటు మరికొన్ని కంపెనీలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా చైనాకు తరలించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో ఇప్పటికే దిల్లీకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితులపై ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్​ఎస్​బీసీ బ్యాంకు, పేటీఎం, క్యాష్ ఫ్రీ రోజీ పే ద్వారా నగదును చైనాకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్న నైసర్ కొఠారి హస్తం ఉన్నట్లు వెల్లడైంది. భావ్​నగర్​లో క్రిప్టో కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్న నైసర్.. ఆన్​లైన్ జూదం నిర్వాహకుల నుంచి నగదు స్వీకరించి దానిని విదేశాలకు తరలించినట్లు తెలిసింది. నైసర్ కొఠారిని న్యాయస్థానంలో హాజరు పరచిన ఈడీ కస్టడీకి కోరగా... 13 నుంచి 22 వరకు న్యాయస్థానం అనుమతించింది.

ఇదీ చూడండి: చిట్టీల పేరుతో వంద మందికి రూ.10 కోట్ల కుచ్చుటోపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.