ETV Bharat / jagte-raho

విగ్రహాలను ధ్వంసం చేశారు.. అంతటితో ఆగకుండా..? - medchal district crime news

మూసాపేట్ సర్దార్​నగర్​లో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న దుర్గామాత ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఓ శునకాన్ని చంపి.. ఆలయ ఆవరణలో వేలాడదీశారు. ఘటనపై స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

God statue demolished at sardar nagar in musapet
విగ్రహాలను ధ్వంసం చేశారు.. అంతటితో ఆగకుండా..?
author img

By

Published : Jan 25, 2021, 1:57 PM IST

కూకట్‌పల్లి మూసాపేట్ సర్దార్​నగర్​లో దుర్గామాత ఆలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుడిలోని విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు. సమీపంలోని జంట నాగుల విగ్రహాన్నీ ముక్కలు చేశారు. ఆపై ఓ శునకాన్ని చంపి.. ఆలయ ఆవరణలో వేలాడదీశారు.

విషయం తెలుసుకున్న మూసాపేట్ భాజపా కార్పొరేటర్ మహేందర్​ ఆలయం ఎదుట బైఠాయించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

God statue demolished at sardar nagar in musapet
ఎమ్మెల్యే ఆగ్రహం

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహాల ఏర్పాటు, ఆలయ అభివృద్ధికి గానూ తాను రూ. 5 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: శూలంతో పొడిచి.. డంబెల్​తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!

కూకట్‌పల్లి మూసాపేట్ సర్దార్​నగర్​లో దుర్గామాత ఆలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుడిలోని విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు. సమీపంలోని జంట నాగుల విగ్రహాన్నీ ముక్కలు చేశారు. ఆపై ఓ శునకాన్ని చంపి.. ఆలయ ఆవరణలో వేలాడదీశారు.

విషయం తెలుసుకున్న మూసాపేట్ భాజపా కార్పొరేటర్ మహేందర్​ ఆలయం ఎదుట బైఠాయించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

God statue demolished at sardar nagar in musapet
ఎమ్మెల్యే ఆగ్రహం

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహాల ఏర్పాటు, ఆలయ అభివృద్ధికి గానూ తాను రూ. 5 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: శూలంతో పొడిచి.. డంబెల్​తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.