ETV Bharat / jagte-raho

గతంలో సస్పెన్షన్​.. 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే భూమిపై కన్ను! - మాదాపూర్​ మహిళా పోలీస్​ లేటెస్ట్​ వార్తలు

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఇన్​స్పెక్టర్​ వ్యవహారశైలి ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో సస్పెన్షన్​కు కారణమైన భూవివాదంలోనే మరోసారి తలదూర్చడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా భూ యజమాని ఫిర్యాదు మేరకు ఆమెపై మాదాపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

case on Women inspector plot to seize Madhapur land
గతంలో సస్పెన్షన్​.. 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే భూమిపై కన్ను!
author img

By

Published : Oct 6, 2020, 1:02 PM IST

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో గతంలో సస్పెన్షన్​కు గురైన భూవివాదంలోనే మరోసారి తలదూర్చారంటూ ఓ మహిళా ఇన్​స్పెక్టర్​పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల శంషాబాద్​ జోన్​ పరిధిలోని ఓ ఠాణా ఎస్​హెచ్​వోగా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా బాధ్యతలు స్వీకరించిన 11 నెలల్లోనే బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆమెను కమిషనర్​ ఆఫీసుకు అటాచ్​ చేశారు.

మాదాపూర్​ భూమిపై కన్ను..

మాదాపూర్​ సర్వే ఆఫ్​ ఇండియా లేఅవుట్​లో సుమారు 500 గజాల ప్లాటును పీఎం అబ్రహం 1982లో కొనుక్కున్నాడు . 2001లో వరంగల్​ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన హరిప్రసాద్​కు ఆ స్థలాన్ని విక్రయించాడు. అప్పటి నుంచి ఆ స్థలం ఆయన అధీనంలోనే ఉంది. ఈ స్థలం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీన్ని చేజిక్కించుకునేందుకు సదరు మహిళాఅధికారి గతంలో రంగంలోకి దిగింది. అప్పటికి ఆమె మాదాపూర్​ స్టేషన్​లో ఎస్సైగా పనిచేస్తున్నారు. భర్త కూడా పోలీస్​శాఖలోనే విధులు నిర్వర్తిస్తుండగా.. అధికారాన్ని ఉపయోగించుకుని ఇద్దరు కలిసి కబ్జా చేసేందుకు యత్నించారు. విషయం ఉన్నతాధికారులకు చేరగా.. ఆమెపై కేసు నమోదు చేసుకుని సస్పెండ్​ చేశారు.

నకిలీ పత్రాలతో మోసం..

నకిలీ పత్రాలు సృష్టించి ఆ ప్లాట్​ తనదేనంటూ మరోసారి తెరపైకొచ్చారు. అక్కడి నుంచి ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ యజమాని మాదాపూర్​ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నెల 3న మహిళా ఇన్​స్పెక్టర్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండిః 'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​గా మార్చేశారు'

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో గతంలో సస్పెన్షన్​కు గురైన భూవివాదంలోనే మరోసారి తలదూర్చారంటూ ఓ మహిళా ఇన్​స్పెక్టర్​పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల శంషాబాద్​ జోన్​ పరిధిలోని ఓ ఠాణా ఎస్​హెచ్​వోగా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా బాధ్యతలు స్వీకరించిన 11 నెలల్లోనే బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆమెను కమిషనర్​ ఆఫీసుకు అటాచ్​ చేశారు.

మాదాపూర్​ భూమిపై కన్ను..

మాదాపూర్​ సర్వే ఆఫ్​ ఇండియా లేఅవుట్​లో సుమారు 500 గజాల ప్లాటును పీఎం అబ్రహం 1982లో కొనుక్కున్నాడు . 2001లో వరంగల్​ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన హరిప్రసాద్​కు ఆ స్థలాన్ని విక్రయించాడు. అప్పటి నుంచి ఆ స్థలం ఆయన అధీనంలోనే ఉంది. ఈ స్థలం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీన్ని చేజిక్కించుకునేందుకు సదరు మహిళాఅధికారి గతంలో రంగంలోకి దిగింది. అప్పటికి ఆమె మాదాపూర్​ స్టేషన్​లో ఎస్సైగా పనిచేస్తున్నారు. భర్త కూడా పోలీస్​శాఖలోనే విధులు నిర్వర్తిస్తుండగా.. అధికారాన్ని ఉపయోగించుకుని ఇద్దరు కలిసి కబ్జా చేసేందుకు యత్నించారు. విషయం ఉన్నతాధికారులకు చేరగా.. ఆమెపై కేసు నమోదు చేసుకుని సస్పెండ్​ చేశారు.

నకిలీ పత్రాలతో మోసం..

నకిలీ పత్రాలు సృష్టించి ఆ ప్లాట్​ తనదేనంటూ మరోసారి తెరపైకొచ్చారు. అక్కడి నుంచి ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ యజమాని మాదాపూర్​ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నెల 3న మహిళా ఇన్​స్పెక్టర్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండిః 'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​గా మార్చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.