నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్టు... టాస్క్పోర్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎస్సై ప్రభాకర్ పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 2,69,000 స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఔరా నల్లమల.. వన్యప్రాణులు భళా!