ETV Bharat / jagte-raho

ఆగిఉన్న కంటైనర్​ లారీని ఢీకొట్టిన బైకు.. ఒకరు మృతి - సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం తాజా వార్తలు

ఆగి ఉన్న కంటైనర్​ లారీని బైకు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Bike collided with a container lorry .. One died
ఆగిఉన్న కంటైనర్​ లారీని ఢీకొట్టిన బైకు.. ఒకరు మృతి
author img

By

Published : Jul 2, 2020, 7:40 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బెల్లాపూర్‌కు చెందిన ఇమందర్ తయ్యబ్ అలీ కొంతకాలంగా కూకట్‌పల్లిలో ఫాస్ట్​ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన బెల్లాపూర్‌కు వెళుతుండగా.. పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: ఇద్దరు సొంత అక్కలను చంపిన నిందితుడు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బెల్లాపూర్‌కు చెందిన ఇమందర్ తయ్యబ్ అలీ కొంతకాలంగా కూకట్‌పల్లిలో ఫాస్ట్​ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన బెల్లాపూర్‌కు వెళుతుండగా.. పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: ఇద్దరు సొంత అక్కలను చంపిన నిందితుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.