ETV Bharat / jagte-raho

కారును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

author img

By

Published : Dec 25, 2020, 10:55 AM IST

ముక్కోటి ఏకాదశి రోజున ఖమ్మం రహదారి నెత్తురోడింది. మయూరి కూడలి వంతెనపై ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Accident on  Mayuri Bridge in Khammam
కారు, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

ఖమ్మం జిల్లాలోని మయూరి వంతెనపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవానాన్ని ఎదురుగా వస్తోన్న కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఖమ్మం గ్రామీణ మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన పసుపులేటి సంపత్(24) ఖమ్మం బ‌స్టాండ్‌ వైపు వస్తుండగా మయూరి కూడలి వంతెనపై సూర్యాపేట వైపు వెళ్తున్న ఓ కారు అతని ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు పైనుంచి కింద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లాలోని మయూరి వంతెనపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవానాన్ని ఎదురుగా వస్తోన్న కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఖమ్మం గ్రామీణ మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన పసుపులేటి సంపత్(24) ఖమ్మం బ‌స్టాండ్‌ వైపు వస్తుండగా మయూరి కూడలి వంతెనపై సూర్యాపేట వైపు వెళ్తున్న ఓ కారు అతని ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు పైనుంచి కింద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కొడుకును చూసింది... అమ్మ మురిసింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.