ETV Bharat / jagte-raho

అదుపుతప్పిన బైక్.. ​పైనుంచి వెళ్లిన లారీ..

author img

By

Published : Dec 8, 2020, 10:49 PM IST

డివైడర్​కు తగిలి బైక్​ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్​పై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండల పరిధిలో చోటుచేసుకుంది.

accident on 44 national high way and one person died
అదుపుతప్పిన బైక్.. ​పైనుంచి వెళ్లిన లారీ..

కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఉన్న డివైడర్​ను గమనించక పోవడంతో బైక్​ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్​పై నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన వ్యక్తి ప్రకాశ్​(28)గా, గాయపడిన రాజిరెడ్డి కామారెడ్డివాసులుగా గుర్తించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఉన్న డివైడర్​ను గమనించక పోవడంతో బైక్​ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్​పై నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన వ్యక్తి ప్రకాశ్​(28)గా, గాయపడిన రాజిరెడ్డి కామారెడ్డివాసులుగా గుర్తించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

ఇదీ చూడండి: మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.