అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో తెల్లవారుజామున 6 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రతాప్ గతంలో ముషీరాబాద్ ఎస్సైగా, చిక్కడపల్లి డీఐగా, నగర ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. వారం క్రితం ఓ కేసు విషయంలో సస్పెండ్ అయినట్లు సమాచారం.
మరోవైపు ప్రతాప్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీచూడండి: కరోనా విజృంభణ- 80 లక్షలకు చేరువలో కేసులు