ETV Bharat / jagte-raho

ఏసీపీ నర్సింహారెడ్డి పెట్టుబడులెక్కడ.. బినామీలెవరు..!

author img

By

Published : Sep 30, 2020, 5:25 PM IST

అక్రమాస్తుల కేసులో అనిశాకు చిక్కిన ఏసీపీ నర్సింహారెడ్డి నుంచి పూర్తి సమాచారం సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థిరాస్తి రంగంలో ఎంత పెట్టుబడి పెట్టారు.. బినామీలుగా ఎవరు వ్యవహరించారు అనే కోణంలో విచారించనున్నారు.

acp narsimhareddy illegal Assets case
నర్సింహారెడ్డి.. పెట్టుబడులు ఎక్కడ పెట్టారు.. బినామీలెవరు..!

ఆదాయానికి మించి ఆస్తుల అంశంలో అనిశాకు చిక్కిన ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయనను నాలుగు రోజుల పాటు అనిశా కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించింది. అక్టోబరు 5 నుంచి 8 వరకు విచారించనున్నారు.

ప్రస్తుతం నర్సింహారెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన నివాసంలో సోదాల సమయంలో 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు, బంగారం, నగదు, రెండు బ్యాంకు లాకర్లను అనిశా అధికారులు గుర్తించారు. స్థిరాస్తి రంగంలో సదరు అధికారి ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు.. అక్రమాస్తులకు ఎవరెవరు బినామీగా వ్యవరించారు.. అనే కోణంలో దర్యాప్తు జరపనున్నారు. ఆయనను విచారించిన సందర్భంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది.

ఇవీచూడండి: అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

ఆదాయానికి మించి ఆస్తుల అంశంలో అనిశాకు చిక్కిన ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయనను నాలుగు రోజుల పాటు అనిశా కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించింది. అక్టోబరు 5 నుంచి 8 వరకు విచారించనున్నారు.

ప్రస్తుతం నర్సింహారెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన నివాసంలో సోదాల సమయంలో 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు, బంగారం, నగదు, రెండు బ్యాంకు లాకర్లను అనిశా అధికారులు గుర్తించారు. స్థిరాస్తి రంగంలో సదరు అధికారి ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు.. అక్రమాస్తులకు ఎవరెవరు బినామీగా వ్యవరించారు.. అనే కోణంలో దర్యాప్తు జరపనున్నారు. ఆయనను విచారించిన సందర్భంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది.

ఇవీచూడండి: అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.