ETV Bharat / jagte-raho

పెంటగుంత నీటిలో పడి మేస్త్రీ మృతి.. ఎలా జరిగిందంటే? - latest crime news in narayanapet district

ప్రమాదవశాత్తు పెంటగుంత నీటిలో పడి ఓ మేస్త్రీ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

a man fell into the water and died at makthal in narayanpet
పెంటగుంత నీటిలో పడి మేస్త్రీ మృతి.. ఎలా జరిగిందంటే?
author img

By

Published : Jul 17, 2020, 6:51 AM IST

కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి చెందిన అమరేష్​, నాగప్పలు మేస్త్రీ పనులు చేసేవారు. 6 రోజుల కిందట నారాయణపేట జిల్లా మక్తల్​ మండలంలోని భగవాన్​పల్లిలో ఇల్లు కట్టేందుకు వచ్చారు. అమరేష్​ బుధవారం రాత్రి మద్యం సేవించి భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు పెంటగుంత నీటిలో పడిపోయాడు.

రాత్రి ఎవరూ గమనించకపోవడం వల్ల అందులోనే మృతి చెందాడు. ఈ ఘటనపై అమరేష్​ పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి చెందిన అమరేష్​, నాగప్పలు మేస్త్రీ పనులు చేసేవారు. 6 రోజుల కిందట నారాయణపేట జిల్లా మక్తల్​ మండలంలోని భగవాన్​పల్లిలో ఇల్లు కట్టేందుకు వచ్చారు. అమరేష్​ బుధవారం రాత్రి మద్యం సేవించి భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు పెంటగుంత నీటిలో పడిపోయాడు.

రాత్రి ఎవరూ గమనించకపోవడం వల్ల అందులోనే మృతి చెందాడు. ఈ ఘటనపై అమరేష్​ పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

ఇదీచూడండి: లిఫ్టులో ఇరుక్కుని మరణించాడు.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.