ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి గ్రామ చెరువులో ఓ వ్యక్తి విగతజీవిగా తేలిన ఘటన నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

author img

By

Published : Oct 29, 2020, 7:56 PM IST

a man accidentally fell into a pond and died at perapalla village in narayanapeta district
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పేరపళ్ల గ్రామంలో చెరువులో పడి గోపాల్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన గోపాల్(49) బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఈ రోజు గ్రామ చెరువులో శవమై తేలాడు.

నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పేరపళ్ల గ్రామంలో చెరువులో పడి గోపాల్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన గోపాల్(49) బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఈ రోజు గ్రామ చెరువులో శవమై తేలాడు.

నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను చితక్కొట్టిన స్థానికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.