ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

author img

By

Published : Aug 27, 2020, 3:06 AM IST

ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా వెల్లంపల్లిలో జరిగింది. అప్పులు చేసి వేసిన పంటను భారీ వర్షాలు తుడిచిపెట్టేయడం వల్ల మనస్తాపంతో పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం వెల్లంపల్లిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన తోకల రాజయ్య పత్తి చేను వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు.. గుర్తించిన కుటంబ సభ్యులు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

రాజయ్యకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకున్న ఎకరం పొలంతో పాటు మరో అర ఎకరా కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలకు పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పురుగుల మందుతాగి బలవన్మరణానకి పాల్పడ్డాడు. మృతిడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం వెల్లంపల్లిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన తోకల రాజయ్య పత్తి చేను వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు.. గుర్తించిన కుటంబ సభ్యులు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

రాజయ్యకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకున్న ఎకరం పొలంతో పాటు మరో అర ఎకరా కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలకు పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పురుగుల మందుతాగి బలవన్మరణానకి పాల్పడ్డాడు. మృతిడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.