సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. హరితహారం మొక్కలు దింపి వస్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కిందపడి బోనాల యుగేందర్(5) అనే బాలుడు మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
బాలుడి తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి: సీఎం ఇంటి ముందే యువకుడి ఆత్మాహుతి యత్నం