పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్జి పబ్జి.. యువతను బానిసగా చేసుకోడానికి విడుదలైన ఓ మొబైల్ గేమ్. 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నరేమో గాని యువత ప్రాణాలతో మాత్రం డిన్నర్ చేస్తోంది ఈ గేమ్. ఆటకు బానిసలైన ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, యువత ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తల్లి మందలించిందనో, తండ్రి కొట్టాడనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. పబ్జి గేమ్ ఆడవద్దంటూ తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రమనస్థాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లోనే నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవీ చూడండి:ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి నిరసన