ETV Bharat / international

ఖషోగ్గీ హత్య కేసులో ఎనిమిది మందికి శిక్ష ఖరారు

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్ట్​ జమాల్​ ఖషోగ్గీ హత్య కేసులో ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది రియాద్ క్రిమినల్​ కోర్టు. వీరిలో ఐదుగురికి 20 ఏళ్లు, ఒకరికి 10 ఏళ్లు, ఇద్దరికి 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

author img

By

Published : Sep 7, 2020, 9:09 PM IST

Saudi jails 8 convicts in Khashoggi killing
జర్నలిస్టు హత్య కేసులో ఎనిమిది మందికి శిక్ష ఖరారు

వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్​, సౌదీ రచయిత జమాల్ ఖషోగ్గి హత్య కేసులో ఎనిమిది మంది దోషులకు శిక్ష ఖరారు చేసింది రియాద్ క్రిమినల్ కోర్టు.

వీరిలో ఐదుగురికి గరిష్ఠంగా 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒకరికి 10 ఏళ్లు, మరో ఇద్దరికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.

సౌదీ రాచరిక ప్రభుత్వ విధానాలపై ఖషోగ్గీ తరచూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 2018 అక్టోబరు 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్​లో సౌదీ దౌత్య కార్యాలయానికి ఆయన వచ్చారు. సౌదీ యువరాజు కోసం పనిచేసే ఏజెంట్లే ఖషోగ్గీని హత్య చేసి ఉంటారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కోర్టు తీర్పుపై హక్కుల సంఘాలు తీవ్రం విమర్శలు చేశాయి. అసలైన నిందితులు తప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి.

వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్​, సౌదీ రచయిత జమాల్ ఖషోగ్గి హత్య కేసులో ఎనిమిది మంది దోషులకు శిక్ష ఖరారు చేసింది రియాద్ క్రిమినల్ కోర్టు.

వీరిలో ఐదుగురికి గరిష్ఠంగా 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒకరికి 10 ఏళ్లు, మరో ఇద్దరికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.

సౌదీ రాచరిక ప్రభుత్వ విధానాలపై ఖషోగ్గీ తరచూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 2018 అక్టోబరు 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్​లో సౌదీ దౌత్య కార్యాలయానికి ఆయన వచ్చారు. సౌదీ యువరాజు కోసం పనిచేసే ఏజెంట్లే ఖషోగ్గీని హత్య చేసి ఉంటారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కోర్టు తీర్పుపై హక్కుల సంఘాలు తీవ్రం విమర్శలు చేశాయి. అసలైన నిందితులు తప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.