ఇరాక్ కిర్కుక్లోని అమెరికా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి క్షిపణి దాడులు జరిగినట్లు ప్రకటన విడుదల చేశాయి ఇరుదేశాల భద్రతా దళాలు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
2019 డిసెంబరు 27 నాటి దాడుల అనంతరం అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు జరగడం ఇదే తొలిసారి . అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మృతికి కారణమైన నాటి ఘటన కతెబ్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థ నిర్వహించిందేనని ఆరోపించింది అమెరికా.
దీనికి ప్రతిగా 25 మంది కతెబ్ హిజ్బుల్లా ఉగ్రవాదులను కాల్చిచంపింది అగ్రరాజ్యం. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఇరాన్ ముఖ్య సైనికాధికారి ఖాసీం సులేమానిని మట్టుబెట్టింది.
ఇదీ చూడండి: ‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తరకొరియా