ETV Bharat / international

ఎయిర్​పోర్ట్​పై డ్రోన్ దాడులు- విమానం ధ్వంసం! - హౌతీ తిరుగుబాటుదారుల దాడి

సౌదీలోని అభా ఎయిర్​పోర్ట్​పై వరుస డ్రోన్ దాడులు(saudi drone attack) జరుగుతున్నాయి. 24 గంటల్లో రెండుసార్లు ఈ విమానాశ్రయంపై దాడులు జరిగాయి. తాజాగా జరిగిన దాడిలో ఓ విమానం పాక్షికంగా ధ్వంసమైంది. ఎనిమిది మంది గాయపడ్డారు.

SAUDI DRONE ATTACK
ఎయిర్​పోర్ట్​పై డ్రోన్ దాడులు
author img

By

Published : Aug 31, 2021, 3:50 PM IST

సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడులు(saudi drone attack) జరిగాయి. ఈ ఘటనలో ఓ విమానం పాక్షికంగా ధ్వంసం కాగా.. ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.

సోమవారం నుంచి ఈ ఎయిర్​పోర్ట్​పై జరిగిన రెండో దాడి(abha airport attack) ఇది. ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. ఇదివరకు జరిగిన దాడికి.. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్​లోని షియా హౌతీ రెబల్స్(houthi rebels attack) కారణమని తెలుస్తోంది. సరిహద్దు దేశమైన యెమెన్​లో హౌతీ తిరుగుబాటుదారులపై.. సౌదీ అరేబియా భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వరుస దాడులు జరగడం గమనార్హం.

ఈ ఘటనపై సౌదీ సైన్యం స్పందించలేదు. పేలుడు పదార్థాలు కలిగిన ఓ డ్రోన్​ను అడ్డుకున్నట్లు చెప్పడం మినహా... దీనిపై వివరాలు వెల్లడించలేదు.

యుద్ధం వెనుక కథ!

2014లో యెమెన్ యుద్ధం(saudi yemen war) ప్రారంభమైంది. ఆ ఏడాది.. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాతో పాటు దేశంలోని చాలా వరకు భూభాగాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. సౌదీ నేతృత్వంలోని కూటమి సైన్యం.. హౌతీ రెబల్స్​ను గద్దెదించి, అంతర్జాతీయ ఆమోదం కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. సౌదీలోని కీలక ఎయిర్​పోర్ట్​లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు దాడులకు తెగబడుతున్నారు.

ఇదీ చదవండి:

'అఫ్గాన్​పై బాంబులేద్దాం.. మన సామాను తెచ్చేసుకుందాం'

అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!

సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడులు(saudi drone attack) జరిగాయి. ఈ ఘటనలో ఓ విమానం పాక్షికంగా ధ్వంసం కాగా.. ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.

సోమవారం నుంచి ఈ ఎయిర్​పోర్ట్​పై జరిగిన రెండో దాడి(abha airport attack) ఇది. ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. ఇదివరకు జరిగిన దాడికి.. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్​లోని షియా హౌతీ రెబల్స్(houthi rebels attack) కారణమని తెలుస్తోంది. సరిహద్దు దేశమైన యెమెన్​లో హౌతీ తిరుగుబాటుదారులపై.. సౌదీ అరేబియా భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వరుస దాడులు జరగడం గమనార్హం.

ఈ ఘటనపై సౌదీ సైన్యం స్పందించలేదు. పేలుడు పదార్థాలు కలిగిన ఓ డ్రోన్​ను అడ్డుకున్నట్లు చెప్పడం మినహా... దీనిపై వివరాలు వెల్లడించలేదు.

యుద్ధం వెనుక కథ!

2014లో యెమెన్ యుద్ధం(saudi yemen war) ప్రారంభమైంది. ఆ ఏడాది.. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాతో పాటు దేశంలోని చాలా వరకు భూభాగాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. సౌదీ నేతృత్వంలోని కూటమి సైన్యం.. హౌతీ రెబల్స్​ను గద్దెదించి, అంతర్జాతీయ ఆమోదం కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. సౌదీలోని కీలక ఎయిర్​పోర్ట్​లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు దాడులకు తెగబడుతున్నారు.

ఇదీ చదవండి:

'అఫ్గాన్​పై బాంబులేద్దాం.. మన సామాను తెచ్చేసుకుందాం'

అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.