ETV Bharat / international

Operation Ajay Israel : 'ఆ సైరన్ల శబ్దం ఇంకా చెవుల్లో మార్మోగుతోంది'.. దిల్లీకి 'ఆపరేషన్ అజయ్​' తొలి విమానం

Operation Ajay Israel : ఇజ్రాయెల్ నుంచి 212 మందితో కూడిన ఆపరేషన్​ అజయ్​ తొలి విమానం దిల్లీకి చేరింది. దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వీరికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. మరోవైపు, ఇజ్రాయెల్​ నుంచి వచ్చిన విద్యార్థులు.. తమ భయానక అనుభవాలను పంచుకున్నారు.

author img

By PTI

Published : Oct 13, 2023, 6:59 AM IST

Updated : Oct 13, 2023, 11:38 AM IST

Operation Ajay Israel
Operation Ajay Israel

Operation Ajay Israel : ఇజ్రాయెల్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ అజయ్​'లో.. 212 మందితో కూడిన తొలి విమానం శుక్రవారం దిల్లీకి చేరింది. వీరికి కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. గురువారం టెల్​ అవీవ్​కు చేరుకున్న చార్టర్డ్​ విమానం.. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం బయలు దేరింది. ఇజ్రాయెల్-హమాస్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో నుంచి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

  • #WATCH | Israel: "I am very happy. It has been very scary here... Thank you Indian government for this evacuation..," says Visesh an Indian passenger returning to India from Tel Aviv under 'Operation Ajay' pic.twitter.com/8cL2p5AkhX

    — ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ అన్నారు. 'ఇజ్రాయెల్​లో చిక్కుక్కున్న భారతీయులను రక్షించడానికి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నారు. భారతీయులను క్షేమంగా వారి ఇళ్లకు చేరేలా చేసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​ జైశంకర్, మంత్రిత్వ శాఖ, ఎయిర్​ఇండియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని మంత్రి చెప్పారు.

  • #WATCH | Union Minister Rajeev Chandrasekhar says, "...Our government will never leave any Indian behind. Our government, our Prime Minister is determined to protect them, bring them back home safely. We are grateful to EAM Dr S Jaishankar, the team at the External Affairs… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/kZuaKmIYSY

    — ANI (@ANI) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సైరన్లు మోగినప్పుడు అక్కడ షెల్టర్లలో తలదాచుకోవచ్చు. అక్కడ పౌరులకు మంచి రక్షణ ఉంటుంది. కానీ మేము అలాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు అలవాటు లేదు. అందుకే చాలా భయం వేసింది. మేం బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం. "
--ఆంచల్ వశిష్ట్, పీహెచ్‌డీ విద్యార్థి

"హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ఏమి చేయాలో ఏమి చేయకూడదో మాకు తెలియదు. రాకెట్ల దాడి ప్రారంభమైన వెంటనే షెల్టర్లలోకి వెళ్లాలి అన్నదే మాకు తెలుసు. కానీ అక్కడి పరిస్థితి సాధారణంగా లేదు. భారత్‌లో ఉన్న మా కుటుంబసభ్యుల చాలా భయపడ్డారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారత్‌ వచ్చేయమన్నారు. అదృష్టవసాత్తు తొలి విమానంలోనే ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు వచ్చాను."
--దీపక్‌ శర్మ, విద్యార్థి

శరణార్థ శిబిరంపై దాడి.. ఒకే చోట 45 మంది మృతి
Israel Attack On Gaza : మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్​లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఉన్న ఓ శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు గాజా హోం శాఖ గురువారం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం ఈ దాడి జరిగినట్లు గాజా హోం శాఖ ప్రతినిధి ఇయాద్ బోజుమ్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాల కింది నుంచి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారని బోజుమ్​ తెలిపారు.

Israel Hamas War USA : ఇదిలా ఉండగా.. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా.. తమ సైనాన్ని మాత్రం ఆ దేశానికి పంపే ఆలోచన లేదంటోంది. ఈ మేరకు శ్వేత సౌధం జాతీయ భద్రతా ప్రతినిధి జాన్​ కిర్బీ గురువారం తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్​కు ఏ మేర సైనిక సహాయం కావాలో నిర్ణయించేందుకు యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి ఆ దేశంలో శుక్రవారం పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్​ గాలంట్​తో భేటీ అవుతారు.

Israel Ground Attack : హమాస్​ను మట్టుబెట్టేందుకు మాస్టర్​ ప్లాన్​.. గ్రౌండ్ ఆపరేషన్​కు ఇజ్రాయెల్ రెడీ

Operation Ajay Israel India : 'ఆపరేషన్​ అజయ్'​కు ఇజ్రాయెల్​ పూర్తి మద్దతు.. శుక్రవారమే భారత్​కు స్పెషల్ ఫ్లైట్​లో తొలి బ్యాచ్​

Operation Ajay Israel : ఇజ్రాయెల్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ అజయ్​'లో.. 212 మందితో కూడిన తొలి విమానం శుక్రవారం దిల్లీకి చేరింది. వీరికి కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. గురువారం టెల్​ అవీవ్​కు చేరుకున్న చార్టర్డ్​ విమానం.. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం బయలు దేరింది. ఇజ్రాయెల్-హమాస్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో నుంచి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

  • #WATCH | Israel: "I am very happy. It has been very scary here... Thank you Indian government for this evacuation..," says Visesh an Indian passenger returning to India from Tel Aviv under 'Operation Ajay' pic.twitter.com/8cL2p5AkhX

    — ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ అన్నారు. 'ఇజ్రాయెల్​లో చిక్కుక్కున్న భారతీయులను రక్షించడానికి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నారు. భారతీయులను క్షేమంగా వారి ఇళ్లకు చేరేలా చేసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​ జైశంకర్, మంత్రిత్వ శాఖ, ఎయిర్​ఇండియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని మంత్రి చెప్పారు.

  • #WATCH | Union Minister Rajeev Chandrasekhar says, "...Our government will never leave any Indian behind. Our government, our Prime Minister is determined to protect them, bring them back home safely. We are grateful to EAM Dr S Jaishankar, the team at the External Affairs… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/kZuaKmIYSY

    — ANI (@ANI) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సైరన్లు మోగినప్పుడు అక్కడ షెల్టర్లలో తలదాచుకోవచ్చు. అక్కడ పౌరులకు మంచి రక్షణ ఉంటుంది. కానీ మేము అలాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు అలవాటు లేదు. అందుకే చాలా భయం వేసింది. మేం బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం. "
--ఆంచల్ వశిష్ట్, పీహెచ్‌డీ విద్యార్థి

"హమాస్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ఏమి చేయాలో ఏమి చేయకూడదో మాకు తెలియదు. రాకెట్ల దాడి ప్రారంభమైన వెంటనే షెల్టర్లలోకి వెళ్లాలి అన్నదే మాకు తెలుసు. కానీ అక్కడి పరిస్థితి సాధారణంగా లేదు. భారత్‌లో ఉన్న మా కుటుంబసభ్యుల చాలా భయపడ్డారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారత్‌ వచ్చేయమన్నారు. అదృష్టవసాత్తు తొలి విమానంలోనే ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు వచ్చాను."
--దీపక్‌ శర్మ, విద్యార్థి

శరణార్థ శిబిరంపై దాడి.. ఒకే చోట 45 మంది మృతి
Israel Attack On Gaza : మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్​లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఉన్న ఓ శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు గాజా హోం శాఖ గురువారం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం ఈ దాడి జరిగినట్లు గాజా హోం శాఖ ప్రతినిధి ఇయాద్ బోజుమ్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాల కింది నుంచి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారని బోజుమ్​ తెలిపారు.

Israel Hamas War USA : ఇదిలా ఉండగా.. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా.. తమ సైనాన్ని మాత్రం ఆ దేశానికి పంపే ఆలోచన లేదంటోంది. ఈ మేరకు శ్వేత సౌధం జాతీయ భద్రతా ప్రతినిధి జాన్​ కిర్బీ గురువారం తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్​కు ఏ మేర సైనిక సహాయం కావాలో నిర్ణయించేందుకు యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి ఆ దేశంలో శుక్రవారం పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్​ గాలంట్​తో భేటీ అవుతారు.

Israel Ground Attack : హమాస్​ను మట్టుబెట్టేందుకు మాస్టర్​ ప్లాన్​.. గ్రౌండ్ ఆపరేషన్​కు ఇజ్రాయెల్ రెడీ

Operation Ajay Israel India : 'ఆపరేషన్​ అజయ్'​కు ఇజ్రాయెల్​ పూర్తి మద్దతు.. శుక్రవారమే భారత్​కు స్పెషల్ ఫ్లైట్​లో తొలి బ్యాచ్​

Last Updated : Oct 13, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.