China Plane Crash: ఇటీవల జరిగిన చైనా విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 132 మంది మృతిచెందినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత.. అనేక గంటలు గాలింపు చేపట్టినా.. ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కన్పించలేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.
మరోవైపు, ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. నాలుగు రోజుల క్రితమే కాక్పిట్ వాయిస్ రికార్డర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఫ్లైట్ డేటా రికార్డర్ను సైతం గుర్తించారు. ఈ రెండింటి సాయంతో ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. వీటిని విశ్లేషించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటారు.
ఇదీ చూడండి: ఉక్రెయిన్పై ఆగని దాడులు.. 16,400 మంది రష్యా సైనికులు మృతి!