ETV Bharat / international

'కరోనా 3.0 ముంచుకొస్తున్న ప్రళయం'

author img

By

Published : Nov 23, 2020, 5:39 AM IST

దాదాపు ఏడాది క్రితం ప్రారంభమైన కరోనా సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా దశలు దశలుగా విజృంభిస్తోంది. తొలిదశలో ఏర్పడిన సంక్షోభం నుంచి ఇంకా తేరుకోక ముందే.. పలు దేశాల్లో కరోనా 2.0 వచ్చింది. ఈ భయాలు కొనసాగుతున్న సమయంలోనే కరోనా 3.0పై తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కఠిన చర్యలతో వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతే.. మూడోదశ ఖాయమని తేల్చిచెప్పింది.

WHO special envoy warns of danger of 3rd wave of COVID-19 pandemic in Europe in early 2021
కరోనా 3.0తో 2021లో ముంచుకొస్తున్న ప్రళయం

ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి తొలి దశ అదుపులోకి రాకముందే.. చాలా దేశాల్లో కరోనా 2.0 మొదలైంది. ఈ దశలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దీనితోనే ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. ఇంతలో కరోనా 3.0 విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలపై 2021 ఆరంభంలో వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభించే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ అధికార ప్రతినిధి డేవిడ్​ నబారో ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అందుకే కరోనా 3.0..

ఐరోపా దేశాలు రెండో దశ కొవిడ్​-19 వ్యాప్తిని అరికట్టడంలో విఫలమయ్యాయని డేవిడ్​ తెలిపారు. ఫలితంగానే మూడోదశ రూపంలో విజృంభిస్తోందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలోనే వైరస్​ సంక్రమణకు అడ్డుకట్టవేసే అవకాశాన్ని చేజార్చుకున్నారని.. ఇప్పటికైనా దృష్టి సారించకపోతే వచ్చే ఏడాది తొలినాళ్లలో మూడోదశ ఖాయమని హెచ్చరించారు నబారో. లాక్​డౌన్​ వంటి మార్గదర్శకాలను పాటించకుండానే వైరస్​ను అదుపులోకి తెచ్చేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలతో ఆయా దేశాలు భవిష్యత్తులో భారీమూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అరికట్టగలం'

ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి తొలి దశ అదుపులోకి రాకముందే.. చాలా దేశాల్లో కరోనా 2.0 మొదలైంది. ఈ దశలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దీనితోనే ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. ఇంతలో కరోనా 3.0 విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలపై 2021 ఆరంభంలో వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభించే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ అధికార ప్రతినిధి డేవిడ్​ నబారో ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అందుకే కరోనా 3.0..

ఐరోపా దేశాలు రెండో దశ కొవిడ్​-19 వ్యాప్తిని అరికట్టడంలో విఫలమయ్యాయని డేవిడ్​ తెలిపారు. ఫలితంగానే మూడోదశ రూపంలో విజృంభిస్తోందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలోనే వైరస్​ సంక్రమణకు అడ్డుకట్టవేసే అవకాశాన్ని చేజార్చుకున్నారని.. ఇప్పటికైనా దృష్టి సారించకపోతే వచ్చే ఏడాది తొలినాళ్లలో మూడోదశ ఖాయమని హెచ్చరించారు నబారో. లాక్​డౌన్​ వంటి మార్గదర్శకాలను పాటించకుండానే వైరస్​ను అదుపులోకి తెచ్చేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలతో ఆయా దేశాలు భవిష్యత్తులో భారీమూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అరికట్టగలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.