ETV Bharat / international

ఆక్స్​ఫర్డ్​ టీకా జనవరి తొలివారంలో?

author img

By

Published : Dec 28, 2020, 5:51 AM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ తొందరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 4వ తేదీన యూకేలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌.. జనవరి నాలుగో తేదీన అందుబాటులోకి వస్తుందని బ్రిటన్‌ మీడియా తాజాగా వెల్లడించింది. టీకా పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, దీనిపై తాజాగా బ్రిటన్‌ ఆరోగ్యశాఖ స్పందించింది. 'వ్యాక్సిన్ ప్రయోగాల‌ సమాచారాన్ని విశ్లేషించేందుకు నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ)కు కొంత సమయం ఇవ్వాలి. ఎంహెచ్‌ఆర్‌ఏ సలహా మేరకే నిర్ణయం తీసుకుంటాం’' అని ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

వచ్చే రెండు వారాల్లోనే దాదాపు 20లక్షల మందికి ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన టీకా 70 శాతానికి పైగా సమర్థత కలిగినట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఇదివరకే వెల్లడైంది. మరోవైపు కొత్తరకం వైరస్‌ విజృంభణ కొనసాగడం, యూకేలో కరోనా తీవ్రత మరింత పెరిగిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూకే నిర్ణయం వైపే భారత్‌ చూపు..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లోనూ జరుగుతున్నాయి. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమాచార విశ్లేషణ అనంతరం.. బ్రిటన్‌ నియంత్రణ సంస్థలు తీసుకునే నిర్ణయం కోసమే భారత్‌ నియంత్రణ సంస్థలు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్రిటన్‌లో టీకాకు అనుమతి అభించిన వెంటనే భారత్‌లోని నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కూడా వ్యాక్సిన్‌ సమాచార విశ్లేషణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి: భారత్​లో ముందుగా కొవిషీల్డ్​ టీకానే వస్తుందా?

'కొత్త' కరోనా పైనా ఆక్స్​ఫర్డ్ టీకా ప్రభావవంతం!

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌.. జనవరి నాలుగో తేదీన అందుబాటులోకి వస్తుందని బ్రిటన్‌ మీడియా తాజాగా వెల్లడించింది. టీకా పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, దీనిపై తాజాగా బ్రిటన్‌ ఆరోగ్యశాఖ స్పందించింది. 'వ్యాక్సిన్ ప్రయోగాల‌ సమాచారాన్ని విశ్లేషించేందుకు నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ)కు కొంత సమయం ఇవ్వాలి. ఎంహెచ్‌ఆర్‌ఏ సలహా మేరకే నిర్ణయం తీసుకుంటాం’' అని ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

వచ్చే రెండు వారాల్లోనే దాదాపు 20లక్షల మందికి ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన టీకా 70 శాతానికి పైగా సమర్థత కలిగినట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఇదివరకే వెల్లడైంది. మరోవైపు కొత్తరకం వైరస్‌ విజృంభణ కొనసాగడం, యూకేలో కరోనా తీవ్రత మరింత పెరిగిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూకే నిర్ణయం వైపే భారత్‌ చూపు..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లోనూ జరుగుతున్నాయి. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమాచార విశ్లేషణ అనంతరం.. బ్రిటన్‌ నియంత్రణ సంస్థలు తీసుకునే నిర్ణయం కోసమే భారత్‌ నియంత్రణ సంస్థలు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్రిటన్‌లో టీకాకు అనుమతి అభించిన వెంటనే భారత్‌లోని నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కూడా వ్యాక్సిన్‌ సమాచార విశ్లేషణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి: భారత్​లో ముందుగా కొవిషీల్డ్​ టీకానే వస్తుందా?

'కొత్త' కరోనా పైనా ఆక్స్​ఫర్డ్ టీకా ప్రభావవంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.