ETV Bharat / international

టర్కీ భూకంపం ఘటనలో 22కు చేరిన మృతులు

author img

By

Published : Jan 25, 2020, 9:29 AM IST

Updated : Feb 18, 2020, 8:18 AM IST

టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 22కి చేరగా... వెయ్యి మందికిపై ప్రజలు గాయపడ్డారు. తూర్పు టర్కీ, ఇలాజిగ్​ రాష్ట్రంలోని సివ్‌రిస్‌ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Powerful quake kills 18 people in eastern Turkey
టర్కీ భూకంపంలో 18కి చేరిన మృతులు సంఖ్య
టర్కీ భూకంపం ఘటనలో 22కు చేరిన మృతులు

తూర్పు టర్కీలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. 30మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు... సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అన్వేషిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రమైన ఇలాజిగ్​లోని సివ్​రైస్​ పట్టణం కేంద్రంగా 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. 30 సెకన్లకు మించి భూమి కంపించడం వల్ల ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. చలిని భరిస్తూ అక్కడే ఉండిపోయారు.

వెన్నంటే ఉంటాం: టర్కీ అధ్యక్షుడు

భూకంపం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టర్కీ అధ్యక్షుడు రెసిప్​ తయ్యిప్​ ఎర్డోగాన్. ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని​ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. దేశంలో త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

1999లో పశ్చిమ టర్కీలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క ఇస్తాంబుల్​ నగరంలోనే 1000కిపైగా మంది మరణించారు.

ఇదీ చదవండి: వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!

టర్కీ భూకంపం ఘటనలో 22కు చేరిన మృతులు

తూర్పు టర్కీలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. 30మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు... సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అన్వేషిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రమైన ఇలాజిగ్​లోని సివ్​రైస్​ పట్టణం కేంద్రంగా 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. 30 సెకన్లకు మించి భూమి కంపించడం వల్ల ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. చలిని భరిస్తూ అక్కడే ఉండిపోయారు.

వెన్నంటే ఉంటాం: టర్కీ అధ్యక్షుడు

భూకంపం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టర్కీ అధ్యక్షుడు రెసిప్​ తయ్యిప్​ ఎర్డోగాన్. ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని​ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. దేశంలో త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

1999లో పశ్చిమ టర్కీలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క ఇస్తాంబుల్​ నగరంలోనే 1000కిపైగా మంది మరణించారు.

ఇదీ చదవండి: వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!

Intro:नई दिल्ली: नागरिकता संशोधन विधेयक और एनआरसी को लेकर चल रही देशभर में विरोध के बाद कई राज्यों ने इस कानून को लागू करने से मना कर दिया है। इसी कड़ी में छत्तीसगढ़ सरकार भी बहुत जल्द फैसला ले सकती है।


Body:मीडिया से बातचीत के दौरान छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल ने कहा कि सीएए और एनआरसी खिलाफ रेशन पास करने को लेकर बहुत जल्द राज्य में कैबिनेट की मीटिंग चर्चा की जाएगी।

एक बार फिर प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह पर हमला बोलते हुए बघेल ने कहा कि देश में जो भी विरोध प्रदर्शन हो रहे हैं उसका कारण "मोटा भाई" और "छोटा भाई" है। उन्होंने यह भी कहा, " केंद्र सरकार की तरफ से इस कानून को लेकर एक मत सामने नहीं आ रहा है। सरकार देश के असली मुद्दों पर बात करने के लिए तैयार ही नहीं है। पुलवामा हमले के दौरान इतना आरडीएक्स देश में कैसे आया, देश की अर्थव्यवस्था और बढ़ती हुई बेरोजगारी पर खड़े हुए सवालों का भी कोई जवाब नहीं है। जब इन सभी बातों का जवाब सरकार नहीं दे पाती है तो वह हिंदुस्तान-पाकिस्तान या फिर हिंदू मुसलमान की बातें करने लग जाती है।"

शुक्रवार को छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल ने कांग्रेस अध्यक्ष सोनिया गांधी और राहुल गांधी से मुलाकात की जिसमें उन्होंने हाल ही में हुए मेयर के चुनावों में जीत हासिल करने के लिए छत्तीसगढ़ सरकार को बधाई दी। इस मीटिंग में भूपेश बघेल ने छत्तीसगढ़ सरकार की पिछले 1 साल की उपलब्धियों की रिपोर्ट भी कांग्रेस अध्यक्षा को सौंपी।


Conclusion:मीटिंग के बाद छत्तीसगढ़ कांग्रेस के प्रभारी पी एल पुनिया ने कहा कि छत्तीसगढ़ कांग्रेस और प्रदेश सरकार देश में एकता का मिसाल है पिछले दिनों नगरीय निकाय चुनाव में मिली बड़ी जीत के बाद मुख्यमंत्री भूपेश बघेल और कांग्रेस आलाकमान की पहली बैठक है।
Last Updated : Feb 18, 2020, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.