ETV Bharat / international

డబ్ల్యూటీఓ తర్వాతి డీజీగా ఎంగోజీ ఖరారు! - ప్రపంచ వాణిజ్య సంస్త డైరెక్టర్ జనరల్

ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టేందుకు నైజీరియా అభ్యర్థి ఎంగోజీ ఆంకోజో ఈవేలాకు మార్గం సుగమమైంది. దక్షిణ కొరియా అభ్యర్థి పోటీ నుంచి వైదొలగడం, ఎంగోజీకి అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్ల.. ఆమె ఎన్నిక లాంఛనమే కానున్నట్లు తెలుస్తోంది.

Nigeria's Ngozi Okonjo-Iweala to become next DG of WTO
డబ్ల్యూటీఓ డీజీగా నైజీరియా మహిళ ఖరారు!
author img

By

Published : Feb 6, 2021, 1:15 PM IST

ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్​గా నైజీరియాకు చెందిన ఎంగోజీ ఆకోంజో ఈవేలా ఎంపికకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియా అభ్యర్థి 'యూ మ్యూంగ్ హీ' రేసు నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఆకోంజో బాధ్యతలు స్వీకరిస్తే డబ్ల్యూటీఓ డీజీ పదవిని అధిరోహించిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్​గా ఆమె రికార్డుకెక్కనున్నారు.

డీజీ ఎంపికపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో నవంబర్​లో ఈ ప్రక్రియ కొద్ది కాలం నిలిచిపోయింది. ఫిబ్రవరి 5న కొరియా అభ్యర్థి వెనక్కి తగ్గిన వెంటనే.. ఎంగోజీకి మద్దతు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆర్థిక రంగంతో పాటు, అంతర్జాతీయ దౌత్య విషయాల్లో ఎంగోజీకి ఉన్న 25 ఏళ్ల అనుభవం డబ్ల్యూటీఓకు ఉపకరిస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకుతో పాటు, నైజీరియా ఆర్థిక మంత్రిగా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపింది.

అమెరికా ప్రకటనతో ఎంగోజీ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు సాధారణ మండలి సమావేశాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు సమాచారం.

థ్యాంక్యూ ఇండియా!

డబ్ల్యూటీఓ డీజీ ఎంపిక ప్రక్రియలో తొలి నుంచి తనకు మద్దతు ఇచ్చినందుకు భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు ఎంగోజీ. డబ్ల్యూటీఓలోని భారత రాయబారులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'డబ్ల్యూటీఓ ఎన్నిక- భారత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం!'

ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్​గా నైజీరియాకు చెందిన ఎంగోజీ ఆకోంజో ఈవేలా ఎంపికకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియా అభ్యర్థి 'యూ మ్యూంగ్ హీ' రేసు నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఆకోంజో బాధ్యతలు స్వీకరిస్తే డబ్ల్యూటీఓ డీజీ పదవిని అధిరోహించిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్​గా ఆమె రికార్డుకెక్కనున్నారు.

డీజీ ఎంపికపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో నవంబర్​లో ఈ ప్రక్రియ కొద్ది కాలం నిలిచిపోయింది. ఫిబ్రవరి 5న కొరియా అభ్యర్థి వెనక్కి తగ్గిన వెంటనే.. ఎంగోజీకి మద్దతు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆర్థిక రంగంతో పాటు, అంతర్జాతీయ దౌత్య విషయాల్లో ఎంగోజీకి ఉన్న 25 ఏళ్ల అనుభవం డబ్ల్యూటీఓకు ఉపకరిస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకుతో పాటు, నైజీరియా ఆర్థిక మంత్రిగా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపింది.

అమెరికా ప్రకటనతో ఎంగోజీ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు సాధారణ మండలి సమావేశాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు సమాచారం.

థ్యాంక్యూ ఇండియా!

డబ్ల్యూటీఓ డీజీ ఎంపిక ప్రక్రియలో తొలి నుంచి తనకు మద్దతు ఇచ్చినందుకు భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు ఎంగోజీ. డబ్ల్యూటీఓలోని భారత రాయబారులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'డబ్ల్యూటీఓ ఎన్నిక- భారత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.