ETV Bharat / international

ఇటలీలో 24 గంటల్లో సుమారు 1000 మంది మృతి

ఇటలీలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. ఐరోపా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆ దేశాల్లో మొత్తం 18,289 మంది చనిపోయారు.

author img

By

Published : Mar 27, 2020, 11:41 PM IST

italy-records-almost-1000-virus-deaths
ఇటలీలో కరోనా కల్లోలం... ఒక్కరోజులో 969మంది మృతి

ఇటలీలో కరోనా మృత్యుఘోష తీవ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 969 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 9,134కి చేరింది. కరోనా కారణంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో ఇంతమంది చనిపోయిన ఘటనలు లేవు. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 86,500కు చేరింది.

ఐరోపా విలవిల

చైనాలో మొదలైన కరోనా ఐరోపాలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 3,05,851కేసులు నమోదయ్యాయి. 18,289మంది మృత్యువాత పడ్డారు. ఐరోపా తర్వాత ఆసియాలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. మొత్తం 1,02,043 కేసులు నమోదు కాగా, 3,683మంది మరణించారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 26 వేలు దాటిన మరణాలు

ఇటలీలో కరోనా మృత్యుఘోష తీవ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 969 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 9,134కి చేరింది. కరోనా కారణంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో ఇంతమంది చనిపోయిన ఘటనలు లేవు. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 86,500కు చేరింది.

ఐరోపా విలవిల

చైనాలో మొదలైన కరోనా ఐరోపాలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 3,05,851కేసులు నమోదయ్యాయి. 18,289మంది మృత్యువాత పడ్డారు. ఐరోపా తర్వాత ఆసియాలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. మొత్తం 1,02,043 కేసులు నమోదు కాగా, 3,683మంది మరణించారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 26 వేలు దాటిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.