ETV Bharat / international

తొలి డోసు తర్వాత కరోనా సోకే అవకాశం తక్కువే!

author img

By

Published : May 17, 2021, 5:50 AM IST

Updated : May 17, 2021, 6:50 AM IST

కరోనా టీకా తొలిడోసు తీసుకున్న తర్వాత కొవిడ్ సోకే అవకాశం తక్కువగా ఉందని ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తెేలింది. గతేడాది డిసెంబర్ 27 నుంచి మే 3 వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిని పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు శాస్త్రవేత్తలు.

covid vaccine
ఇటలీ కొవిడ్, కరోనా టీకా

వ్యాక్సిన్ తొలిడోసు వేసుకున్నవారిలో ఐదు వారాల తర్వాత కరోనా సోకే ప్రమాదం 80 శాతం మేర తగ్గిందని ఇటలీ పరిశోధన సంస్థ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఇటలీలో గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ నెల 3 వరకు ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్న వారిని పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. దాదాపు కోటీ 40 లక్షల మందిని పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు.

"తొలి డోసు వేసుకున్న 35 రోజులకు కరోనా సోకే శాతం 80కి, ఆసుపత్రుల పాలయ్యే శాతం 90కి, మరణాల శాతం 95కి తగ్గింది" అని శాస్త్రవేత్తలు తెలిపారు.

వ్యాక్సిన్ తొలిడోసు వేసుకున్నవారిలో ఐదు వారాల తర్వాత కరోనా సోకే ప్రమాదం 80 శాతం మేర తగ్గిందని ఇటలీ పరిశోధన సంస్థ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఇటలీలో గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ నెల 3 వరకు ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్న వారిని పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. దాదాపు కోటీ 40 లక్షల మందిని పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు.

"తొలి డోసు వేసుకున్న 35 రోజులకు కరోనా సోకే శాతం 80కి, ఆసుపత్రుల పాలయ్యే శాతం 90కి, మరణాల శాతం 95కి తగ్గింది" అని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చదవండి: జనాభా వృద్ధిలో క్షీణత- ఆ దేశాలకు ఇక కష్టాలేనా?

Last Updated : May 17, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.