ETV Bharat / international

'భారత్​లో ఆందోళకరంగా కరోనా పరిస్థితి' - WHO on India covid situation

భారత్​ కరోనా పరిస్థితి తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) వ్యాఖ్యానించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు, మరణాలతో పాటు కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఘటనలు పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

WHO Chief
డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : May 15, 2021, 5:22 AM IST

భారత్‌లో రెండో దశ కరోనా విలయం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు, మరణాలతో పాటు కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఘటనలు పెరిగి పోతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా రెండోదశ మరీ ప్రాణాంతమని వ్యాఖ్యానించారు.

భారత్‌లో కరోనా కట్టడి కోసం డబ్ల్యూహెచ్​ఓ కూడా సమర్థంగా పనిచేస్తోందని వివరించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, టెంట్లు, క్షేత్రస్థాయి ఆస్పత్రుల నిర్వహణ, మాస్కులు, మెడికల్ పరికరాలు, ఔషధాల పంపిణీ చేపడుతున్నట్లు టెడ్రోస్ తెలిపారు. కష్టకాలంలో భారత్‌కు అండగా ఉన్న అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

భారత్‌తో పాటు నేపాల్‌, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్‌, కాంబోడియా ఈజిప్టు వంటి దేశాల్లోనూ కరోనా వేరియంట్లు విలయం సృష్టిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ, మధ్య అమెరికా దేశాలు కూడా కరోనా గుప్పిట చిక్కి.. విలవిల్లాడుతున్నాయని టెడ్రోస్ అన్నారు. కరోనా నుంచి బయటపడడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా చెప్పిన టెడ్రోస్‌.. టీకా సరఫరాతో పాటు వ్యాక్సినేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నాయని వివరించారు.

ఇదీ చూడండి: 'భారత్​లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'

భారత్‌లో రెండో దశ కరోనా విలయం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు, మరణాలతో పాటు కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఘటనలు పెరిగి పోతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా రెండోదశ మరీ ప్రాణాంతమని వ్యాఖ్యానించారు.

భారత్‌లో కరోనా కట్టడి కోసం డబ్ల్యూహెచ్​ఓ కూడా సమర్థంగా పనిచేస్తోందని వివరించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, టెంట్లు, క్షేత్రస్థాయి ఆస్పత్రుల నిర్వహణ, మాస్కులు, మెడికల్ పరికరాలు, ఔషధాల పంపిణీ చేపడుతున్నట్లు టెడ్రోస్ తెలిపారు. కష్టకాలంలో భారత్‌కు అండగా ఉన్న అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

భారత్‌తో పాటు నేపాల్‌, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్‌, కాంబోడియా ఈజిప్టు వంటి దేశాల్లోనూ కరోనా వేరియంట్లు విలయం సృష్టిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ, మధ్య అమెరికా దేశాలు కూడా కరోనా గుప్పిట చిక్కి.. విలవిల్లాడుతున్నాయని టెడ్రోస్ అన్నారు. కరోనా నుంచి బయటపడడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా చెప్పిన టెడ్రోస్‌.. టీకా సరఫరాతో పాటు వ్యాక్సినేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నాయని వివరించారు.

ఇదీ చూడండి: 'భారత్​లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.