ETV Bharat / international

చైనాకు 'జీరో- కొవిడ్'​ కష్టాలు.. జర్మనీలో రికార్డుస్థాయిలో కేసులు

చైనాలో కరోనా వైరస్​ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. చైనా అనుసరిస్తున్న జీరో-కొవిడ్​ వ్యూహం కారణంగా భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జర్మనీలోనూ కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఐసీయూ రోగులతో దేశం గడ్డు పరిస్థితిలోకి వెళ్తుతోంది.

author img

By

Published : Nov 8, 2021, 10:30 PM IST

covid
చైనా కొవిడ్​

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ రూపాంతరం చెందుతూ మళ్లీ విజృంభిస్తుండడంతో పలు దేశాలు కట్టడి వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా వైరస్‌తో కలిసి జీవిస్తూనే మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనాకు పుట్టినిల్లైన చైనా మాత్రం 'కొవిడ్‌-జీరో' వ్యూహంతోనే ముందుకెళుతోంది. ఇదే సమయంలో అక్కడ పలు నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో నానా కష్టాలు పడుతోంది.

రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం కొవిడ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే 'జీరో-కొవిడ్‌' కట్టడి వ్యూహాన్నే నమ్ముకుంది. దీంతో ఒక్క కేసు వెలుగు చూసినా.. లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపడుతోంది. ఇందుకోసం భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ విధించడంతోపాటు విమాన ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయలేక చైనా తీవ్రంగా శ్రమిస్తోంది.

సమర్థించుకుంటున్న డ్రాగన్‌..

అధిక జనాభా కలిగిన చైనాలో వైరస్‌ కట్టడికి అనుసరిస్తోన్న జీరో వ్యూహమే మేలని స్థానిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వైరస్‌తో కలిసి జీవించాల్సి వస్తే ఎంతోమంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే జీరో కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. అయితే, ఈ వ్యూహం ఎంతకాలం విజయవంతం అవుతుందో చెప్పలేమని చైనా ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ విధానంపై చైనా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే, శీతాకాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున చైనా ప్రభుత్వం తన విధానంపై పునః పరిశీలన చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు పీటర్‌ కల్లిగ్‌నాన్‌ పేర్కొన్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలు కూడా చైనా వ్యూహాన్నే అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు.

పలు రంగాలపై ప్రతికూల ప్రభావమే..

చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్‌ వ్యూహం వల్ల పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు కేంద్రంగా ఉండే ఆతిథ్య రంగం కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బీఎన్‌పీ పరిబాస్‌ అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థకు చెందిన నిపుణురాలు జెస్సికా టీ అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశం వరకూ కొవిడ్‌ కట్టడి వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చైనాలోని స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌కి చెందిన చీఫ్‌ ఎకనమిస్ట్‌ షువాంగ్‌ డింగ్‌ పేర్కొన్నారు. అప్పటివరకు ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ ఫలితాలు, కొవిడ్‌ను స్థానిక వ్యాప్తిగా పరిగణించే ప్రకటనలను పరిశీలించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

అప్పటివరకూ సరిహద్దుల మూతేనా..?

చైనాలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా దేశ సరిహద్దులను ఆ ప్రభుత్వం మూసివేసింది. ఆంక్షల నడుమ పరిమిత సంఖ్యలో మాత్రమే విదేశీయులను అనుమతి ఇస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా ఇతర దేశాల ఎగుమతి, దిగుమతులపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా చైనాలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ వరకూ అంతర్జాతీయ కొవిడ్‌ ఆంక్షలను చైనా ఎత్తివేయకపోవచ్చని అక్కడి పర్యాటకరంగ నిపుణులు గేరీ బొవెర్‌మ్యాన్‌ అంచనా వేశారు. మరో ఏడాది తర్వాతే సరిహద్దు ఆంక్షలను చైనా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ఇలా వైరస్‌ కట్టడిని సమర్థంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న చైనా.. జీరో కొవిడ్‌ వ్యూహంతో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

జర్మనీలో ఇలా..

భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఐసీయూ రోగులతో దేశంలో కరోనా పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 201.1గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం. స్థానిక రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. జర్మనీలో చివరగా అత్యధిక ఇన్‌ఫెక్షన్‌ రేటు గతేడాది డిసెంబర్‌ 22న నమోదైంది. అప్పుడు ఇది 197.6గా ఉండగా.. ఇప్పుడు 200 దాటింది. పైగా, గతేడాదితో పోల్చిస్తే ప్రస్తుతం చాలామందికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడం గమనార్హం.

టీకా తీసుకోనివారిపై ఆంక్షలు..

ఇక్కడి సాక్సోనీ స్టేట్‌లో ఇన్‌ఫెక్షన్‌ రేటు జాతీయ సగటు కంటే రెండింతలు ఎక్కువ.. 491.3గా ఉండటం ఆందోళనకరం! దీంతో వ్యాక్సినేషన్ పూర్తికాని వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆర్‌కేఐ చీఫ్ లోథర్ వైలర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారిపై నేటి నుంచి మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చారు. హోటళ్లలో ప్రవేశం, ఇతర ఇండోర్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు, లేదా వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు చూపాల్సిందే! ఇదిలా ఉండగా అధికారిక వివరాల ప్రకారం.. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ తొలి డోసు పూర్తయింది. మరోవైపు దేశవ్యాప్తంగా అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది.

జపాన్​లో..

15 నెలల్లో తొలిసారిగా.. జపాన్​లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదు. జపాన్​లో మొత్తం మరణాల సంఖ్య 18,310గా ఉంది. అదే సమయంలో కొవిడ్​ కేసులు కూడా దిగొచ్చాయి. పరిస్థితులు మెరుగుపడటం వల్ల పూర్తిస్థాయిలో టీకా తీసుకున్న విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, తాత్కాలిక వ్యాపార పర్యటకులకు అనుమతులిచ్చింది అక్కడి ప్రభుత్వం. క్వారంటైన్​ రోజులను 10 నుంచి మూడుకు తగ్గించింది.

ఇదీ చూడండి:- ఐరోపా, మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ కరోనా కల్లోలం

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ రూపాంతరం చెందుతూ మళ్లీ విజృంభిస్తుండడంతో పలు దేశాలు కట్టడి వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా వైరస్‌తో కలిసి జీవిస్తూనే మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనాకు పుట్టినిల్లైన చైనా మాత్రం 'కొవిడ్‌-జీరో' వ్యూహంతోనే ముందుకెళుతోంది. ఇదే సమయంలో అక్కడ పలు నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో నానా కష్టాలు పడుతోంది.

రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం కొవిడ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే 'జీరో-కొవిడ్‌' కట్టడి వ్యూహాన్నే నమ్ముకుంది. దీంతో ఒక్క కేసు వెలుగు చూసినా.. లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపడుతోంది. ఇందుకోసం భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ విధించడంతోపాటు విమాన ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయలేక చైనా తీవ్రంగా శ్రమిస్తోంది.

సమర్థించుకుంటున్న డ్రాగన్‌..

అధిక జనాభా కలిగిన చైనాలో వైరస్‌ కట్టడికి అనుసరిస్తోన్న జీరో వ్యూహమే మేలని స్థానిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వైరస్‌తో కలిసి జీవించాల్సి వస్తే ఎంతోమంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే జీరో కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. అయితే, ఈ వ్యూహం ఎంతకాలం విజయవంతం అవుతుందో చెప్పలేమని చైనా ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ విధానంపై చైనా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే, శీతాకాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున చైనా ప్రభుత్వం తన విధానంపై పునః పరిశీలన చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు పీటర్‌ కల్లిగ్‌నాన్‌ పేర్కొన్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలు కూడా చైనా వ్యూహాన్నే అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు.

పలు రంగాలపై ప్రతికూల ప్రభావమే..

చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్‌ వ్యూహం వల్ల పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు కేంద్రంగా ఉండే ఆతిథ్య రంగం కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బీఎన్‌పీ పరిబాస్‌ అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థకు చెందిన నిపుణురాలు జెస్సికా టీ అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశం వరకూ కొవిడ్‌ కట్టడి వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చైనాలోని స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌కి చెందిన చీఫ్‌ ఎకనమిస్ట్‌ షువాంగ్‌ డింగ్‌ పేర్కొన్నారు. అప్పటివరకు ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ ఫలితాలు, కొవిడ్‌ను స్థానిక వ్యాప్తిగా పరిగణించే ప్రకటనలను పరిశీలించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

అప్పటివరకూ సరిహద్దుల మూతేనా..?

చైనాలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా దేశ సరిహద్దులను ఆ ప్రభుత్వం మూసివేసింది. ఆంక్షల నడుమ పరిమిత సంఖ్యలో మాత్రమే విదేశీయులను అనుమతి ఇస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా ఇతర దేశాల ఎగుమతి, దిగుమతులపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా చైనాలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ వరకూ అంతర్జాతీయ కొవిడ్‌ ఆంక్షలను చైనా ఎత్తివేయకపోవచ్చని అక్కడి పర్యాటకరంగ నిపుణులు గేరీ బొవెర్‌మ్యాన్‌ అంచనా వేశారు. మరో ఏడాది తర్వాతే సరిహద్దు ఆంక్షలను చైనా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ఇలా వైరస్‌ కట్టడిని సమర్థంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న చైనా.. జీరో కొవిడ్‌ వ్యూహంతో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

జర్మనీలో ఇలా..

భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఐసీయూ రోగులతో దేశంలో కరోనా పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 201.1గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం. స్థానిక రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. జర్మనీలో చివరగా అత్యధిక ఇన్‌ఫెక్షన్‌ రేటు గతేడాది డిసెంబర్‌ 22న నమోదైంది. అప్పుడు ఇది 197.6గా ఉండగా.. ఇప్పుడు 200 దాటింది. పైగా, గతేడాదితో పోల్చిస్తే ప్రస్తుతం చాలామందికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడం గమనార్హం.

టీకా తీసుకోనివారిపై ఆంక్షలు..

ఇక్కడి సాక్సోనీ స్టేట్‌లో ఇన్‌ఫెక్షన్‌ రేటు జాతీయ సగటు కంటే రెండింతలు ఎక్కువ.. 491.3గా ఉండటం ఆందోళనకరం! దీంతో వ్యాక్సినేషన్ పూర్తికాని వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆర్‌కేఐ చీఫ్ లోథర్ వైలర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారిపై నేటి నుంచి మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చారు. హోటళ్లలో ప్రవేశం, ఇతర ఇండోర్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు, లేదా వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు చూపాల్సిందే! ఇదిలా ఉండగా అధికారిక వివరాల ప్రకారం.. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ తొలి డోసు పూర్తయింది. మరోవైపు దేశవ్యాప్తంగా అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది.

జపాన్​లో..

15 నెలల్లో తొలిసారిగా.. జపాన్​లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదు. జపాన్​లో మొత్తం మరణాల సంఖ్య 18,310గా ఉంది. అదే సమయంలో కొవిడ్​ కేసులు కూడా దిగొచ్చాయి. పరిస్థితులు మెరుగుపడటం వల్ల పూర్తిస్థాయిలో టీకా తీసుకున్న విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, తాత్కాలిక వ్యాపార పర్యటకులకు అనుమతులిచ్చింది అక్కడి ప్రభుత్వం. క్వారంటైన్​ రోజులను 10 నుంచి మూడుకు తగ్గించింది.

ఇదీ చూడండి:- ఐరోపా, మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ కరోనా కల్లోలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.